టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను.. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి…
జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట..
సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరం పారిపోతుంది. ఒకప్పుడు ఆమె కూడా ప్రమోషన్స్కు వచ్చేది, కానీ ఎందుకో మధ్యలో ఈ ప్రమోషన్స్కు బ్రేక్ వేసింది. నిజానికి సౌత్ సినీ పరిశ్రమ ఒక రకంగా హీరో సెంట్రిక్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలు అన్ని విషయాలలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు, నిర్మాతలు. అయితే నయనతార ప్రమోషన్స్ కారణంగా టైమ్ వృథా అవుతుందని…
P.G. Vinda: 2025 తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ (TCA) ఎన్నికలు ఉత్సాహభరితంగా ముగిశాయి. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యుల భారీగా హాజరై.. అసోసియేషన్ పట్ల వారి నిబద్ధత, ఐక్యతను చాటారు. అసోసియేషన్ అభివృద్ధికి తమ పాలుపంచుకునే స్ఫూర్తితో చాలామంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పి.జి. విందా మరోసారి అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. గతానికి ప్రాతిపదికగా ఆయన తీసుకున్న చొరవలు, నిర్వహణా నైపుణ్యం సభ్యులకు నమ్మకాన్ని కలిగించాయి. ఆయనతో పాటు రాహుల్ శ్రీవాత్సవ్…
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారి ఉగాది పంచాంగ శ్రవణం అద్భుతంగా సాగింది. అలాగే బెంగళూరు నాయర్ సిస్టర్స్ చేసిన విష్ణువైభవం భరత నృత్యం, ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం చేసిన విశ్వనాధామృతం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. నిహారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరామన్నారు. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదని.. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏపీలో సినిమాలు తీసేందుకు చాలా లోకేషన్లు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. మండలిలో విశాఖలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. వీటిపై మంత్రి సమాధానాలు…
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది.
కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్లకు కూడా ప్రభుత్వం తెలిపింది.
మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది! యాక్టర్ల పారితోషికాలు మామూలుగా లేవు. ఏకంగా సినిమా బడ్జెట్లో 60 శాతం రెమ్యునరేషన్స్ అందజేస్తున్నారు. ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు భారీగా పెరిగాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే.