ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచిర్యాలకు చెందిన యువతికి ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్ కాల్స్, మెసేజెస్, లింక్స్ పంపించి ఖాతాలు లూటీ చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మరో మోసం వెలుగు చూసింది. హైదరాబాదులోని ఓ కంపెనీని నట్టేటముంచేశారు సైబర్ క్రిమినల్స్. ఈమెయిల్ తో బురిడీ కొట్టించి ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన ఓ కంపెనీ హాంకాంగ్ కంపెనీ నుంచి ముడిసరుకు కొనుగోలు చేస్తుంది. ముడిసరుకు అందిన తరువాత…
గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టొరంటో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఐ ఎయిర్పోర్ట్కు ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది.
గూగుల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి కనీస అవసరంలాగా మారిపోయింది. సెర్చ్ ఇంజన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు గూగుల్. అంతలా ఎదిగిపోయింది మరీ ఆ సంస్థ. ఏ విషయం అడిగినా ప్రతి ఒక్కరు గూగుల్ సెర్చ్ చేయడం సాధారణమైపోయింది. అంతటి దిగ్గజ సంస్థ పుట్టి నేటికి 25 ఏళ్లు అయింది. ఈ క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగ్ రాశారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మధుర రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ఈరోజు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు తర్వాత పాఠశాల ఖాళీ చేశారు. ఢిల్లీ పోలీసులు ప్రాంగణంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలోని ఓ స్కూల్ కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో దక్షిణ ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ విద్యార్థులను ఖాళీ చేయించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ను రప్పించారు. ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు.