Cyber Fraud: ఈమెయిల్ తో బురిడీ కొట్టించి.. రూ. 10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
- ఈమెయిల్ తో బురిడీ కొట్టించి
- రూ. 10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
- హైదరాబాదులోని ఓ కంపెనీని నట్టేటముంచిన సైబర్ క్రిమినల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్ కాల్స్, మెసేజెస్, లింక్స్ పంపించి ఖాతాలు లూటీ చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మరో మోసం వెలుగు చూసింది. హైదరాబాదులోని ఓ కంపెనీని నట్టేటముంచేశారు సైబర్ క్రిమినల్స్. ఈమెయిల్ తో బురిడీ కొట్టించి ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన ఓ కంపెనీ హాంకాంగ్ కంపెనీ నుంచి ముడిసరుకు కొనుగోలు చేస్తుంది. ముడిసరుకు అందిన తరువాత కంపెనీ నగదు బదిలీ చేస్తోంది.
అయితే హాంకాంగ్ కంపెనీతో కొనుగోళ్ళు, ఆర్థిక లావదేవీలు మొత్తం కూడా మెయిల్స్ ద్వారానే కొనసాగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరస్తులు ఈమెయిల్ హ్యాక్ చేశారు. ఆ తర్వాత ముడి సరుకు కావాలంటూ సదర్ కంపెనీ హాంకాంగ్ కంపెనీకి ఎప్పుడు మెయిల్ పెడుతుందా అని ఎదురుచూశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కంపెనీ ఆ కంపెనీకి సరుకు కావాలంటూ మెయిల్ పెట్టింది. అయితే ముడిసరుకు చేరుకున్న తర్వాత నగదును మరో అకౌంట్ కు బదిలీ చేయాలంటూ సైబర్ నేరస్తులు మెయిల్ పెట్టారు. ప్రస్తుత అకౌంట్ ఆడిట్లో ఉన్నందున మరో అకౌంట్ కు బదిలీ చేయాలంటూ మెయిల్ పంపించారు.
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
హైదరాబాద్ కు చెందిన కంపెనీ రూ. 10 కోట్లను ఆ అకౌంట్ కి బదిలీ చేసింది. వారం రోజుల తర్వాత హైదరాబాద్ కంపెనీకి నగదు రాలేదంటూ హాంగ్కాంగ్ కంపెనీ సమాచారం ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న హైదరాబాద్ కంపెనీ సిబ్బంది, వారం క్రితమే డబ్బులు బదిలీ చేసిన అకౌంట్ డీటెయిల్స్ ని హాంగ్కాంగ్ కంపెనీకి పంపించారు. ఇది పరీశీలించిన తర్వాత ఆ అకౌంటు తమది కాదని, ఆ మెయిల్ కూడా తాము పంపలేదని హాంకాంగ్ కంపెనీ సిబ్బంది తెలిపారు. దీంతో మోసపోయామని గ్రహించిన హైదరాబాద్ కంపెనీ సిబ్బంది సైబర్ సెల్ ల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!