Delhi: ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. పోలీసులు తనిఖీలు
- ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు
- పోలీసులు తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. మాల్వియా నగర్లోని ఎస్కేవీ హౌజ్ రాణి, కరోల్ బాగ్లోని ఆంధ్రా స్కూల్కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
సోమవారం కూడా ఇదే తరహాలో రాజధాని అంతటా 32 పాఠశాలలకు మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు రంగంలోకి దిగి విద్యార్థులను ఇంటికి పంపేసి తనిఖీలు చేపట్టగా నకిలీ బాంబ్ బెదిరింపుగా గుర్తించారు. తిరిగి 48 గంటలలోపు ఇదే తరహాలో తాజాగా ఈ బెదిరింపులు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
జనవరి నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్లోని కనీసం 74 విద్యా సంస్థలు, 70 పాఠశాలలు, నాలుగు కళాశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. జూలై నెలలోనే రోహిణి, పితంపుర, పశ్చిమ విహార్, దక్షిణ ఢిల్లీ, మధ్య ఢిల్లీలో దాదాపు 50 పాఠశాలలను లక్ష్యంగా ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఖాళీ చేయించారు. హిందూ కళాశాల, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఐపీ కాలేజ్ ఫర్ ఉమెన్ వంటి కళాశాలలు ఇబ్బందిపడ్డాయి. గత నెలలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, సెయింట్ థామస్ పాఠశాలకు బెదిరింపులు పంపినందుకు 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ తర్వాత పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు నకిలీవేనని తేలిందని, అయితే ప్రతి ఒక్కటి పూర్తి తీవ్రతతో దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.
ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ బాంబ్ బెదిరింపులు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చిలిపి పనులే అయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనల సృష్టిస్తున్నాయి. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..