Delhi: ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. పోలీసులు తనిఖీలు
- ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు
- పోలీసులు తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. మాల్వియా నగర్లోని ఎస్కేవీ హౌజ్ రాణి, కరోల్ బాగ్లోని ఆంధ్రా స్కూల్కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
సోమవారం కూడా ఇదే తరహాలో రాజధాని అంతటా 32 పాఠశాలలకు మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు రంగంలోకి దిగి విద్యార్థులను ఇంటికి పంపేసి తనిఖీలు చేపట్టగా నకిలీ బాంబ్ బెదిరింపుగా గుర్తించారు. తిరిగి 48 గంటలలోపు ఇదే తరహాలో తాజాగా ఈ బెదిరింపులు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
జనవరి నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్లోని కనీసం 74 విద్యా సంస్థలు, 70 పాఠశాలలు, నాలుగు కళాశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. జూలై నెలలోనే రోహిణి, పితంపుర, పశ్చిమ విహార్, దక్షిణ ఢిల్లీ, మధ్య ఢిల్లీలో దాదాపు 50 పాఠశాలలను లక్ష్యంగా ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఖాళీ చేయించారు. హిందూ కళాశాల, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఐపీ కాలేజ్ ఫర్ ఉమెన్ వంటి కళాశాలలు ఇబ్బందిపడ్డాయి. గత నెలలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, సెయింట్ థామస్ పాఠశాలకు బెదిరింపులు పంపినందుకు 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ తర్వాత పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు నకిలీవేనని తేలిందని, అయితే ప్రతి ఒక్కటి పూర్తి తీవ్రతతో దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.
ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ బాంబ్ బెదిరింపులు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చిలిపి పనులే అయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనల సృష్టిస్తున్నాయి. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!