Delhi: ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. పోలీసులు తనిఖీలు
- ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు
- పోలీసులు తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. మాల్వియా నగర్లోని ఎస్కేవీ హౌజ్ రాణి, కరోల్ బాగ్లోని ఆంధ్రా స్కూల్కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
సోమవారం కూడా ఇదే తరహాలో రాజధాని అంతటా 32 పాఠశాలలకు మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు రంగంలోకి దిగి విద్యార్థులను ఇంటికి పంపేసి తనిఖీలు చేపట్టగా నకిలీ బాంబ్ బెదిరింపుగా గుర్తించారు. తిరిగి 48 గంటలలోపు ఇదే తరహాలో తాజాగా ఈ బెదిరింపులు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
జనవరి నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్లోని కనీసం 74 విద్యా సంస్థలు, 70 పాఠశాలలు, నాలుగు కళాశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. జూలై నెలలోనే రోహిణి, పితంపుర, పశ్చిమ విహార్, దక్షిణ ఢిల్లీ, మధ్య ఢిల్లీలో దాదాపు 50 పాఠశాలలను లక్ష్యంగా ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఖాళీ చేయించారు. హిందూ కళాశాల, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఐపీ కాలేజ్ ఫర్ ఉమెన్ వంటి కళాశాలలు ఇబ్బందిపడ్డాయి. గత నెలలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, సెయింట్ థామస్ పాఠశాలకు బెదిరింపులు పంపినందుకు 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ తర్వాత పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు నకిలీవేనని తేలిందని, అయితే ప్రతి ఒక్కటి పూర్తి తీవ్రతతో దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.
ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ బాంబ్ బెదిరింపులు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చిలిపి పనులే అయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనల సృష్టిస్తున్నాయి. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!