Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారు
- చదువులమ్మ తల్లిని అటకెక్కిస్తున్న చంద్రబాబు
- యదార్థమైన విద్యా సంస్కరణలు
- 15 వేలు ఇస్తామని ఊదరగొట్టారు: మేరుగ నాగార్జున
Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని, ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ ఆధ్యుడని ఆయన తెలిపారు. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారని, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ 15 వేలు ఇస్తామని ఊదరగొట్టారన్నారు. ఇంటింటికి వెళ్లి నీకు 15 వేలు నీకు 15 వేలు అని చెప్పి నమ్మించారని, అధికారం లోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు చెబుతున్నాడన్నారు మేరుగ నాగార్జున.
తల్లికి వందనం పథకాన్ని ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రతీ కుటుంబాన్ని ఆదుకుని చదివించిన జగన్ ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్ ది అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరు ఓడదాటే వరకూ ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ఉందని, మంచినీరు దొరకడం లేదేమో కానీ ఏపీలో మందు ఏరులై పారుతోందన్నారు. తల్లికి వందనం పథకానికి ఎలాంటి షరతులు పెట్టకుండా వెంటనే ఇవ్వాలని, సామాజిక విప్లవంలో పేటెంట్ తెచ్చుకున్న జగన్ ఆలోచనలు అమలు చేయాలని ఆయన కోరారు. 72,919 కోట్లను విద్య కోసం జగన్ మోహన్ రెడ్డి ఖర్చు చేశారని ఆయన అన్నారు.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!