Ponnam Prabhakar : ఎడ్యుకేషన్ సిస్టం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది
- విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట టీచర్లు చదువు చెప్పలేకపోతున్నారు
- విద్యా వ్యవస్థను మార్పు, మెరుగు పర్చాల్సిన అవసరం ఉంది
- పెద్దల సభలో నుంచి ఈ మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ శాసన మండలిలో విద్యా వ్యవస్థపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్ లో పరిస్థితిని పరిశీలించినప్పుడు బాధ కలుగుతోందని, ప్రస్తుత విద్యా విధానంలో మార్పు చేసి మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం తీవ్ర సమస్యగా మారింది. మా దగ్గర చిగురు మామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో 50 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు” అని పేర్కొన్నారు.
“ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే విద్యార్థులు సంకోచిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కూల్ బస్సుల సౌకర్యం, ల్యాబ్ సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడం లేదు” అని అన్నారు. “విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పెద్దల సభలో నుంచి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని మంత్రి పేర్కొన్నారు. “కేరళ వంటి రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం అధికంగా ఉండటానికి అక్కడి మంచి విద్యా విధానం కారణం. మన రాష్ట్రంలో కూడా సరైన విధానాన్ని అమలు చేయాలి” అని సూచించారు.
Also Read
“విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ కొన్ని సూచనలు చేశారు. మండలాలకు ప్రత్యేకంగా స్కూల్ బస్సుల వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు” అని మంత్రి తెలిపారు. “ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలూ కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న పిల్లల చదువుకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలకు అతీతంగా సమగ్ర విద్యా విధానం రూపొందించాలి” అని ఆయన స్పష్టం చేశారు.
“రాబోయే కాలంలో అందరి ఆమోదయోగ్యమైన ఒక సమగ్ర విద్యా విధానాన్ని తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “ఉపాధ్యాయ నియామకాలు పెరుగుతున్నా, జీతాలు పెరుగుతున్నా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం” అని అన్నారు.
“గతంలో కరీంనగర్లో నాలుగు హైస్కూల్స్ ఉండేవి. ఇప్పుడు స్కూళ్ల సంఖ్య పెరిగింది, ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది, కానీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. ముఖ్యమంత్రి ఇటీవల రవీంద్ర భారతిలో చేసిన వ్యాఖ్యల ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల మధ్య తేడాను పరిశీలించాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. “ప్రైమరీ విద్యనే విద్యార్థులకు బేస్. విద్యా వ్యవస్థ బలోపేతం అయితేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ కోసం మండలాలకు స్కూల్ బస్సుల సౌకర్యాన్ని అందించే ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సంఖ్య పెరగాలంటే సరైన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులను తప్పు పట్టడం లేదు, కానీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది” అని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!