జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా RRR రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరో రామ్ చరణ్ స్పందించారు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రాంచరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ…
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, యువ దర్శకుడు వెంకీ కుడుమలతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. చిరంజీవికి మెగా ఫ్యాన్ అయిన వెంకీ కుడుమల ఈ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దానిని సరదాగా ఓ చిన్న వీడియో రూపంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని, తనపై ఉంచిన…
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ను తెలుగు సినిమా నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డీవివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై నిర్మాతలు పవన్తో చర్చించారు. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్నది. సినిమా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాతలు రంగంలోకి దిగారు.…
సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అభ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. బుధవారం మచిలీపట్నం లోని…
టాలీవుడ్ నిర్మాతలు దిల్రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసుతో పాటు మరికొందరు కలిసి ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం.. పేర్నినాని మాట్లాడుతూ.. ‘నన్ను కలవాలని నిర్మాతలు నిన్న అడిగారు.. ఇండస్ట్రీకి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని నాతో మాట్లాడాలి అన్నారు. ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నాము.. ఇదే మాట సీఎంకు చెప్పండి అని కోరారు. ఆన్లైన్ టికెట్లపై మేము అనుకూలం అని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే పోర్టల్స్…
ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు చర్చలు ముగిసింది. దిల్ రాజుతో పాటు నిర్మాతలు డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసు మరికొందరు కలిసి పేర్ని నానితో చాలా సేపు మంతనాలు జరిపారు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ.. ‘చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశాము. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. దయచేసి అందరూ…
ఏపీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖులతో నేడు సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబుతో పాటు పలువురు థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఓ సినిమా థియేటర్ యజమాని సినిమా టిక్కెట్…
సినిమా టికెట్ ఆన్ లైన్ అనేది తప్పని సరి వ్యవహారంగా ఎపి మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం చిత్ర ప్రముఖులతో జరిగిన సమావేశంలో సినిమా పరిశ్రమతో పాటు థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా సినిమా టికెట్ రేట్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమావేశంలో ఒక ఎగ్జిబిటర్ కన్నీటి పర్యంతం అవటం సమస్య తీవ్రతను తెలియచేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లతో థియేటర్స్ రన్ చేయలేం అంటూ అతడు కళ్ల నీళ్లు…
తమిళ నటుడు ధనుష్ తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. తమిళంలో అగ్రహీరోగా చెలామణిలో ఉన్న ధనుష్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాంకై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతితో…