Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Opposition Backs Dmk In Temple Lamp Row As Judge Impeachment Moves Forward

Temple Lamp Row: సుబ్రమణ్య స్వామి ఆలయ ‘‘దీపం’’పై తీర్పు.. న్యాయమూర్తిపై కాంగ్రెస్-డీఎంకే ‘అభిశంసన’’ తీర్మానం..

Published Date :December 9, 2025 , 3:46 pm
By Venu Goapl Reddy
  • సుబ్రమణ్య స్వామి ఆలయ దీపం వివాదం..
  • కొండపై దీపం వెలిగించాలని న్యాయమూర్తి తీర్పు..
  • న్యాయమూర్తిని తొలగించాలని డీఎంకే, కాంగ్రెస్ ‘‘అభిశంసన తీర్మానం’’..
Temple Lamp Row: సుబ్రమణ్య స్వామి ఆలయ ‘‘దీపం’’పై తీర్పు.. న్యాయమూర్తిపై కాంగ్రెస్-డీఎంకే ‘అభిశంసన’’ తీర్మానం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Temple Lamp Row: తమిళనాడులో ‘‘తిరుప్పరకుండ్రం’’లోని ‘‘సుబ్రమణ్య స్వామి ఆలయం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ వివాదంపై ఆలయం వద్ద ‘‘దీపం’’ వెలిగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించారు. అయితే, ఈ తీర్పు డీఎంకే దాని మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఇతర ఇండీ కూటమి పార్టీలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో తీర్పు చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌పై ‘‘అభిశంసన’’ ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సహా 120 మందికిపైగా ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన ప్రతిపాధనను సమర్పించాయి.

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే కార్తికేయ స్వామి ‘‘దీపం’’ వివాదంతో న్యాయమూర్తిని తొలగించాలని ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఇండీ కూటమి మిత్రపక్షాలు న్యాయమూర్తిని తొలగించాలని ప్రయత్నిస్తున్నాయి.

Read Also: IPL 2026 Auction: 35 కొత్త పేర్లు.. 350 మంది ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

వివాదం ఏంటి.?

తిరుప్పరకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయం కేసం తమిళనాడులో ఇటీవల చర్చనీయాంశంగా మారింది. మధురైలోని ఒక కొండపై దీపం వెలిగించే ఆచారం ‘‘దీపథాన్’’గా పిలువబడే స్తంభాల్లో ఒకదానిపై దీపం వెలిగించడం చుట్టు తిరుగుతోంది. సోమవారం, ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ స్వామినాథన్ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిరసనల్ని తోసిపుచ్చారు. 100 ఏళ్లకు పైగా సంప్రదాయంగా వస్తున్న కొండ పాదాల వద్ద ఉన్న స్తంభానికి బదులుగా కొండపై నిర్మించిన స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించారు. పైన ఉన్న స్తంభం కూడా ఆలయ ఆస్తి అని, దానిని కూడా ఆచారంలో చేర్చాలని న్యాయమూర్తి వాదించారు. ఈ కొండపై 6వ శతాబ్ధానికి చెందిన సుబ్రమణ్య స్వామి ఆలయంతో పాటు 14వ శతాబ్ధానికి చెందిన దర్గా ఉంది. ఇదే ఇక్కడ రాజకీయాలకు కారణమైంది.

డీఎంకే వాదన ఏంటి?

అయితే, ఇలాంటి ఉత్తర్వులు మతపరమైన ఉద్రిక్తతల్ని రేకిత్తించగలవని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఉన్న సమయంలో ఇలాంటి తీర్పుపై డీఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ స్వామినాథన్ తీర్పు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన 2017 తీర్పును తుంగలోకి తొక్కుతుందని డీఎంకే చెబుతోంది.

అయితే, కోర్టు అసలు తీర్పును పాటించకుండా, డిసెంబర్ 3 పండగ రోజు దిగువ స్తంభంపై సాంప్రదాయకంగా ఉండే ప్రదేశంలో దీపం వెలిగించారు. అయితే, తన ఉత్తర్వులు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, మరోసారి కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని మరోసారి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చెలరేగాయి. కేంద్ర బలగాలను పంపడంపై కూడా రాష్ట్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై డీఎంకే డిసెంబర్ 04న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. కానీ రాష్ట్రం చేస్తున్న వాదనల్ని కోర్టు అంగీకరించలేదు. దీంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది విచారణకు రావాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • DMK
  • impeachment move
  • INDIA bloc support
  • Justice GR Swaminathan

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions