మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అమెరికా నుంచి గల్ఫ్ దేశమైన యూఏఈ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 72 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్కు (1 గ్యాలన్ = 3.8 లీటర్లు) 4 డాలర్లకు పైగా (భారత రూపాయలలో సుమారు రూ. 380) పెరిగాయి. అంటే ఒక లీటరు ధర రూ. 100కి చేరింది. గత మూడేళ్లలో గ్యాసోలిన్ ధరలు ఈ స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. Also Read:World Backup…
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాలు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇంకా తగ్గని శ్రీలంకలో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలను పెంచడం అక్కడి ప్రజలకు మరింత భారంగా మారింది. శ్రీలంక ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు గణనీయంగా పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరగనున్నాయి. దీంతో రోజువారీ జీవన…
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇటీవల గృహ, వాణిజ్య వినియోగ గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వదంతులు చెలరేగుతున్నాయి.
అధిక ఇంధన ధరలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రెండేళ్ల సూచన వ్యవధిలో ఇంధన ధరలు తగ్గిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పూరీ మాట్లాడారు.
Petrol and Diesel Price: భారత్లో పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి.. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు భారత్లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.. కానీ, ముడి చమురు ధరలు తగ్గిన ప్రతీసారి పెట్రో ధరలు తగ్గించడం లేదు.. మరోసారి ముడి చమురు ధరలు తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడిచమురు ధర తగ్గినప్పటికీ, నేడు దేశంలోని చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను…
Petrol Rates : పాకిస్తాన్ లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఏకంగా ఒక్కరోజులోనే అక్కడ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ.35పెంచేసింది. పెంచిన ధరలు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు.
Petrol and Diesel Prices: క్రమంగా పైపైకి కదులుతూ కొత్త రికార్డులను సృష్టించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి.. అయితే, త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్పూరి.. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూశాయని.. అయితే, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయని చెప్పుకొచ్చారు.. కానీ, పెట్రోల్పై లాభాలు వస్తున్నా.. డీజిల్పై ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారని…
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా పరులు పెడుతూ పోయిన పెట్రో ధరలకు మళ్లీ బ్రేక్లు పడ్డాయి.. దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 65 పైసలుగా…