అధిక ఇంధన ధరలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రెండేళ్ల సూచన వ్యవధిలో ఇంధన ధరలు తగ్గిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పూరీ మాట్లాడారు.
Petrol and Diesel Price: భారత్లో పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి.. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు భారత్లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.. కానీ, ముడి చమురు ధరలు తగ్గిన ప్రతీసారి పెట్రో ధరలు తగ్గించడం లేదు.. మరోసారి ముడి చమురు ధరలు తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడిచమురు ధర తగ్గినప్పటికీ, నేడు దేశంలోని చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను…
Petrol Rates : పాకిస్తాన్ లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఏకంగా ఒక్కరోజులోనే అక్కడ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ.35పెంచేసింది. పెంచిన ధరలు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు.
Petrol and Diesel Prices: క్రమంగా పైపైకి కదులుతూ కొత్త రికార్డులను సృష్టించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి.. అయితే, త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్పూరి.. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూశాయని.. అయితే, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయని చెప్పుకొచ్చారు.. కానీ, పెట్రోల్పై లాభాలు వస్తున్నా.. డీజిల్పై ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారని…
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా పరులు పెడుతూ పోయిన పెట్రో ధరలకు మళ్లీ బ్రేక్లు పడ్డాయి.. దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 65 పైసలుగా…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి.. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలపాటు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు.. మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభిం,చాయి.. వరుసగా రెండో రోజు లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.01కు చేరగా..…
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ…
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో మనదేశంలోనూ… పెట్రో మంట రేగడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 10 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చని అంచనాలున్నాయి. ధరల పెరుగుదల ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం…