Fuel Prices Hiked: వరుసగా రెండోరోజూ పెట్రో మంట.. కొత్త రేట్లు ఇవిగో..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి.. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలపాటు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు.. మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభిం,చాయి.. వరుసగా రెండో రోజు లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.01కు చేరగా.. డీజిల్ ధర రూ.88.27కు పెరిగింది.. మూడు ప్రభుత్వరంగ ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్.. భారతదేశంలో ఇంధన రిటైలింగ్లో ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే కాగా.. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ధరలను పెంచడానికే మొగ్గు చూపుతున్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Chegg Downfall: ఒకప్పుడు ఎడ్టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
- APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
- Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
తాజా వడ్డింపులతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.21 నుండి రూ.97.01కి, డీజిల్ ధర రూ.86.67 నుంచి రూ.88.27కి పెరిగాయి.. ఇక, ముంబైలో, పెట్రోల్ ధర లీటరుకు రూ.111.67కి, డీజిల్ లీటర్కు రూ.95.85కి పెరిగింది. కోల్కతా మరియు చెన్నైలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా రూ.106.34 మరియు రూ.91.42, చెన్నైలో రూ.102.91 మరియు రూ.92.95 చేరింది.. మరోవైపు బెంగళూరులో పెట్రోల్ ధర రూ.102.26గా, డీజిల్ రూ.86.58కి చేరింది. హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరగా.. ఏపీలో లీటర్ పెట్రోల్పై 87పైసలు, డీజిల్పై 84 పైసలు పెరగడంతో.. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.08, డీజిల్ రూ.98.10కి ఎగబాకింది. దేశవ్యాప్తంగా రిటైల్ ధరలను తగ్గించేందుకు గత ఏడాది నవంబర్ 3న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున తగ్గించింది.. ఇక, కేంద్రం బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా పెరుగుదలకు బ్రేక్ పడింది.. ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోవడం.. అంతర్జాతీయ చమురు ధరలు ఈ సంవత్సరం మళ్లీ పెరగడంతో మళ్లీ వడ్డింపులు ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!