Petrol and Diesel Price: తగ్గిన ముడి చమురు ధరలు.. భారత్లో మారిన పెట్రో ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol and Diesel Price: భారత్లో పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి.. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు భారత్లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.. కానీ, ముడి చమురు ధరలు తగ్గిన ప్రతీసారి పెట్రో ధరలు తగ్గించడం లేదు.. మరోసారి ముడి చమురు ధరలు తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడిచమురు ధర తగ్గినప్పటికీ, నేడు దేశంలోని చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ నిర్ణయిస్తాయి. ఈ ధర ప్రతి రోజు ఉదయం 6 గంటలకు జారీ చేయబడుతుంది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
ఈరోజు పెట్రో ధరల విషయానికి వస్తే దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారాయి. అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు చెన్నై వంటి నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో, ముడి చమురు నేడు రెడ్ మార్క్లో ట్రేడవుతోంది. నేడు డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.40 శాతం క్షీణించింది మరియు ఇది బ్యారెల్కు 70.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.37 శాతం తగ్గి బ్యారెల్కు 74.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Also: CM KCR: నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
ఇక, భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72, డీజిల్ రూ. 89.62గా.. చెన్నైలో పెట్రోలు రూ.102.63, డీజిల్ రూ.94.24గా.. ముంబైలో పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా.. కోల్కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ లీటరుకు రూ.92.76గా కొనసాగుతోంది.. అయితే, ఏ నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారాయి అనే విషయానికి వెళ్తే.. అహ్మదాబాద్లో పెట్రోలు ధర 20 పైసలు తగ్గి రూ. 96.42కి, డీజిల్ 21 పైసలు తగ్గి రూ. 92.17గా ఉంది.. నోయిడాలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ. 97గా, డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 90.14గా ఉంది. ఘజియాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి రూ.96.58కి, డీజిల్ ధర 123 పైసలు పెరిగి రూ.89.75కి చేరింది. గురుగ్రామ్లో పెట్రోల్ 8 పైసలు తగ్గి రూ. 96.89 వద్ద, డీజిల్ లీటరుకు 8 పైసలు తగ్గి రూ. 89.76 వద్ద ఉంది. జైపూర్లో పెట్రోల్ ధర 40 పైసలు పెరిగి రూ. 108.48గా, డీజిల్ 36 పైసలు పెరిగి లీటర్ రూ. 93.72 దగ్గర కొనసాగుతోంది. లక్నోలో పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.96.62కి చేరుకుంది. డీజిల్ ధర 5 పైసలు పెరిగి లీటర్ రూ.89.81కి చేరుకుంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!