Petrol and Diesel Price: తగ్గిన ముడి చమురు ధరలు.. భారత్లో మారిన పెట్రో ధరలు
Petrol and Diesel Price: భారత్లో పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి.. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు భారత్లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.. కానీ, ముడి చమురు ధరలు తగ్గిన ప్రతీసారి పెట్రో ధరలు తగ్గించడం లేదు.. మరోసారి ముడి చమురు ధరలు తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడిచమురు ధర తగ్గినప్పటికీ, నేడు దేశంలోని చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ నిర్ణయిస్తాయి. ఈ ధర ప్రతి రోజు ఉదయం 6 గంటలకు జారీ చేయబడుతుంది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
ఈరోజు పెట్రో ధరల విషయానికి వస్తే దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారాయి. అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు చెన్నై వంటి నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో, ముడి చమురు నేడు రెడ్ మార్క్లో ట్రేడవుతోంది. నేడు డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.40 శాతం క్షీణించింది మరియు ఇది బ్యారెల్కు 70.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.37 శాతం తగ్గి బ్యారెల్కు 74.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Also: CM KCR: నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
ఇక, భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72, డీజిల్ రూ. 89.62గా.. చెన్నైలో పెట్రోలు రూ.102.63, డీజిల్ రూ.94.24గా.. ముంబైలో పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా.. కోల్కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ లీటరుకు రూ.92.76గా కొనసాగుతోంది.. అయితే, ఏ నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారాయి అనే విషయానికి వెళ్తే.. అహ్మదాబాద్లో పెట్రోలు ధర 20 పైసలు తగ్గి రూ. 96.42కి, డీజిల్ 21 పైసలు తగ్గి రూ. 92.17గా ఉంది.. నోయిడాలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ. 97గా, డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 90.14గా ఉంది. ఘజియాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి రూ.96.58కి, డీజిల్ ధర 123 పైసలు పెరిగి రూ.89.75కి చేరింది. గురుగ్రామ్లో పెట్రోల్ 8 పైసలు తగ్గి రూ. 96.89 వద్ద, డీజిల్ లీటరుకు 8 పైసలు తగ్గి రూ. 89.76 వద్ద ఉంది. జైపూర్లో పెట్రోల్ ధర 40 పైసలు పెరిగి రూ. 108.48గా, డీజిల్ 36 పైసలు పెరిగి లీటర్ రూ. 93.72 దగ్గర కొనసాగుతోంది. లక్నోలో పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.96.62కి చేరుకుంది. డీజిల్ ధర 5 పైసలు పెరిగి లీటర్ రూ.89.81కి చేరుకుంది.
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!