గుండెపోటుతో భార్య.. కాసేపట్లోనే భర్త… తిరిగిరాని లోకాలకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది.
తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని చూస్తూ విలపించిన భర్త గుండె కూడా ఆగిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు గంట వ్యవధిలో కన్నుమూసిన సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగారా దంపతులు. ఆరోగ్యంగా ఉన్న దంపతులు గంట వ్యవధిలోనే చనిపోయారు. గుండెపోటుతో భార్య కుప్పకూలింది. తన అర్థాంగి లేని జీవితం నాకెందుకు అనుకున్నాడేమో ఆ భర్త కూడా గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు.
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట గ్రామానికి చెందిన మాసపత్రి రాజయ్య (70) జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థలో ట్రామర్గా చేసి 2017లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య సావిత్రి (65) నలుగురు కుమారులున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో రాజయ్య దంపతులకు బంధువులు ఉండడంతో ఐదేళ్ల క్రితం ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం స్వరూపకు గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. చుట్టుపక్కలవారు ఇంటికొచ్చి చూసేసరికి ఆమె కన్నుమూశారు. భార్య మృతిని తట్టుకోలేక రోదించిన రాజయ్యకు కూడా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక వెంకటాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్ప టికే ఆయన మృతి చెందారని తెలిపారు. ఇద్దరి అంత్యక్రియలు ఓకే సారి నిర్వహించారు. ఈ విషయం తెలిసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజయ్య, సావిత్రి ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా.. చావులోనూ ఇద్దరూ తమ అన్యోన్యతను చాటుకున్నారు.
తాజావార్తలు
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
-
Upcoming Smartphones: హువావే, లావా, షియోమి, మోటరోలా నుంచి.. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్ఫోన్స్ ఇవే
-
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
-
Karuppu : కరుప్పు’ బ్లాక్బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు ‘సూర్య’ ఖరీదైన గిఫ్ట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..