గుండెపోటుతో భార్య.. కాసేపట్లోనే భర్త… తిరిగిరాని లోకాలకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది.
తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని చూస్తూ విలపించిన భర్త గుండె కూడా ఆగిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు గంట వ్యవధిలో కన్నుమూసిన సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగారా దంపతులు. ఆరోగ్యంగా ఉన్న దంపతులు గంట వ్యవధిలోనే చనిపోయారు. గుండెపోటుతో భార్య కుప్పకూలింది. తన అర్థాంగి లేని జీవితం నాకెందుకు అనుకున్నాడేమో ఆ భర్త కూడా గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు.
Also Read
ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట గ్రామానికి చెందిన మాసపత్రి రాజయ్య (70) జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థలో ట్రామర్గా చేసి 2017లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య సావిత్రి (65) నలుగురు కుమారులున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో రాజయ్య దంపతులకు బంధువులు ఉండడంతో ఐదేళ్ల క్రితం ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం స్వరూపకు గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. చుట్టుపక్కలవారు ఇంటికొచ్చి చూసేసరికి ఆమె కన్నుమూశారు. భార్య మృతిని తట్టుకోలేక రోదించిన రాజయ్యకు కూడా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక వెంకటాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్ప టికే ఆయన మృతి చెందారని తెలిపారు. ఇద్దరి అంత్యక్రియలు ఓకే సారి నిర్వహించారు. ఈ విషయం తెలిసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజయ్య, సావిత్రి ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా.. చావులోనూ ఇద్దరూ తమ అన్యోన్యతను చాటుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!