పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నారు మంత్రి నారాయణ.. పల్నాడు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడారు మంత్రి.. అయితే, ప్రస్తుతం దాచేపల్లిలో డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ వివరించారు.. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు.. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలియజేశారు..