HYDRA : రాజేంద్రనగర్లో హైడ్రా కూల్చివేతలు.. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారంటూ వివాదం
- నలందా వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు అనంతరం హైడ్రా చర్య
- అక్రమ నిర్మాణాలపై జేసీబీలతో హైడ్రా దాడి
- స్థానికుల నిరసనలు.. పట్టాదారుల ఆధారాల వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Authority) కదంతొక్కింది. హైదర్ గూడ గ్రామం, సర్వే నంబర్ 16లోని 1000 గజాల పరిమాణంలో ఉన్న పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హైడ్రాకు అందిన ఫిర్యాదులో, హైదర్ గూడలోని పార్క్కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టారని తెలిపారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో JCBలతో సైట్లోకి చేరుకున్నారు.
Floods: నేపాల్-చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
Also Read
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Ujjaini Mahankali Rangam: 'ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు'.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
కూల్చివేతల ప్రక్రియ మొదలైన వెంటనే స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీలను అడ్డుకుంటూ కొందరు మహిళలు నేరుగా వాహనాల ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రభుత్వంగా జారీ అయిన పట్టాలు ఉన్నాయని, ఆ భూముల్లో తామే అసలు యజమానులమని బాధితులు వాదించారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం, సర్వే నంబర్ 16లో ఉన్న భూమి పార్క్కు కేటాయించబడిందని, అందులో ప్రహరీ నిర్మాణం అక్రమమని పేర్కొన్నారు. వాస్తవిక పరిశీలన అనంతరం ఆ నిర్మాణాన్ని కూల్చేశారు.
అయితే, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవన కూల్చివేతలు జరపడం అన్యాయమని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద పరిస్థితుల దృష్ట్యా, పోలీసులు సంఘటనా స్థలానికి భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నా, పట్టాదారులు న్యాయపరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది.. ఎంత బాగుందో ఇప్పుడు..
తాజావార్తలు
-
IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
-
NTR: త్వరలోనే సెట్స్లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ బిజీ!
-
Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
-
LPG e-KYC Deadline: గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక.. ఈ డెడ్లైన్ మిస్ అయితే.. నో గ్యాస్..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
ట్రెండింగ్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?