జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు.
Bangladesh Crisis: ఆందోళనలు కొనసాగుతున్న బంగ్లాదేశ్కు ఎయిరిండియా ఇవాళ (బుధవారం) విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ముందే షెడ్యూల్ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది.
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్లో ఉంచామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.
Supreme Court : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో జూలై 27న ఘోర ప్రమాదం జరిగింది. కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నీటమునిగింది. ఇందులో ఐఏఎస్ పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
MLC Kavitha: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు.