ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి, సౌత్ గ్రూప్ లో ముఖ్య సభ్యుడు శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారుతున్నట్లు తెలిపాడు. దీంతో ఆయన రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఇటీవల ఆశ్రయించారు. అప్రూవర్ గా మారుతున్నందుకు అనుమతివ్వాలంటూ కోరాడు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దవుతోంది. మంగళవారం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుతలో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలను దారి మళ్లించారు. మంగళవారం ఢిల్లీకి రావాల్సిన 10 విమానాల్లో 9 విమానాలను జైపూర్ కు, ఒకదాన్ని లక్నోకు దారి మళ్లించారు.
Wrestlers Protest: భారత రెజ్లర్ల సమాఖ్య(WFI) చీఫ్, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు పదవి నుంచి తొలగించాలని రె
దేశ రాజధాని ఢిల్లీలో పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ ( మంగళవారం ) పురాతన ఖిల్లాను సందర్శించారు. గత చరిత్ర ఆధారాలు పురాణ ఖిల్లా వద్ద లభిస్తున్నాయి..
Brahmos Misfire: గతేడాది పాకిస్థాన్లో అనుకోకుండా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.24 కోట్ల నష్టం వాటిల్లడంతో పాటు పొరుగు దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి.
Delhi Girl Murder Case: రెండు రోజుల క్రితం ఢిల్లీలోని షాబాద్ ఏరియాలో 16 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడు సాహిల్ను ఢిల్లీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. భద్రతాకారణాల రీత్యా నిందితుడిని కోర్టుకు కాకుండా రోహిణి కోర్టు డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జ్యోతి నాయిన్ ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి .. నిందితుడికి రెండు…
Wrestlers Protest: ఢిల్లీ పోలీసులు మహిళా రెజ్లర్లకు షాకిచ్చారు. నిరసనల సందర్భంగా వారు చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్ల నిరసనకు అనుమతి ఇవ్వబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ వారు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే జంతర్ మంతర్ దగ్గర కాకుండా.. వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం సోమవారం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో 'మహిళా సమ్మన్ మహాపంచాయత్'కు పిలుపునిచ్చారు.