Delhi Murder Case: ఢిల్లీ హత్య కేసు నిందితుడికి మరణశిక్ష విధించాలి… ఢిల్లీ పోలీసులు
Delhi Murder Case: ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. నిందితుడు సాహిల్కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించి 640 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. నిందితుడు సాహిల్కు మరణశిక్ష విధించేలా వాటర్టైట్ కేసును సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్య పక్కా ప్రణాళికతో జరిగిందని, నిందితుడికి మరణశిక్ష పడేవిధంగా వాటర్టైట్ కేసు పెట్టామని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో, పగతో జరిగిన హత్య కేసని.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని మరియు ఘటన జరిగిన నెల రోజుల్లోనే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు చార్జిషీటును సమర్పించినట్టు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్) దేవేంద్ర పాఠక్ తెలిపారు.
Read also: Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
సాక్షి హత్యకేసులో సీరియస్గా దర్యాప్తును నిర్వహించి, రికార్డు సమయంలో కోర్టు ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేశాం. నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసును వీలైనంత నీరుగారకుండా ఉండేందుకు ప్రయత్నించామన్నారు. మే 28న వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో మైనర్ బాలికను ప్రజలు చూస్తుండగా హత్య చేసిన నిందితుడు సాహిల్పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
పోక్సో సెక్షన్ 12 (పిల్లలపై లైంగిక వేధింపులు) మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద 640 పేజీల ఛార్జిషీట్ను మంగళవారం పోక్సో కోర్టులో దాఖలు చేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
Read also: Vj Sunny : తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సన్నీ..
నిందితుడిపై ఆయుధాల చట్టంలోని నిబంధనలతో పాటు IPC సెక్షన్లు 302 (హత్య), 354 A (లైంగిక వేధింపులు) మరియు 509 (మహిళ యొక్క అణకువను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కూడా అభియోగాలు మోపారు. ఈ భయానక హత్య దృశ్యాలు CCTV కెమెరాలో ఉన్నాయని.. ఫుటేజీలో యువకుడు కత్తితో బాలికపై 20 సార్లు కంటే తక్కువ కాకుండా అనేక మంది వ్యక్తులు చూస్తుంతడగానే హత్య చేశాడు. ఆమెను రక్షించడానికి ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఆమె శరీరంపై 34 గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాహిల్ను మే 29న ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో అరెస్టు చేశారు. సాహిల్, సాక్షికి పరిచయం ఉన్నప్పటికీ తరచూ గొడవలు జరిగేవని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. మే 27న ఇద్దరికీ గొడవ జరిగిందని.. ఆ తర్వాత సాహిల్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు .. మరుసటి రోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు.
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!