ఢిల్లీలో జీ20 సమ్మిట్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ మీడియాతో మాట్లాడారు. జీ20 సమ్మిట్ ముగింపులో న్యూఢిల్లీ నాయకుల ప్రకటన గ్లోబల్ సౌత్ స్వరాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
G20 Summit 2023: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ నేతల రాక ప్రక్రియ ప్రారంభమైంది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విమానంలో బయలుదేరి సాయంత్రంలోగా భారత్ చేరుకోనున్నారు.
G20 Summit: జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అతిథుల రాక ప్రక్రియ కొనసాగుతోంది.
సెప్టెంబరు 9 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న G20 లీడర్స్ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుల కలయికకు సాక్ష్యమివ్వనుంది. జీ20 సమ్మిట్కు హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఢిల్లీలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ గురించి చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్ ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని, విశ్వాస సందేశాన్ని పంపుతుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు.
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు.
Auto Driver Rides On Foot Over Bridge: ట్రాఫిక్ లో ఇరుక్కోవడం అనేది పెద్ద తలనొప్పి. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ లో నుంచి బయట పడటానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. సగం జీవితం ట్రాఫిక్ లోనే అయిపోయిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు.…
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల శిక్షలను అమలు చేస్తుంది.. కొత్త చట్టాలను తీసుకొని వస్తుంది కానీ కామ కోరికలతో మృగాళ్ళు వావి వరుసలు లేకుండా రెచ్చిపోతున్నారు.. పాలు తాగే పసికందును కూడా వదలట్లేదు.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది 85 ఏళ్ల వృద్దురాలు పై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో 85 ఏళ్ల మహిళపై 28…