ఢిల్లీ ప్రభుత్వం భవన కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ వ్యాన్లను ఉపయోగించి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలోని లేబర్ సైట్ లలో పనిచేస్తున్న భవన కార్మికుల పేర్లను నమోదు చేస్తున్నారు. దీనిద్వారా వీలైనంత ఎక్కువమంది కార్మికుల్ని గుర్తించే అవకాశం వుంది.
ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఆరోగ్యకారణాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత జైన్కు మంజూరైన బెయిల్ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు.
కరోనా మహమ్మారీ మూడేళ్ల క్రితం మృత్యువు గంట మోగించింది.. లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది.. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ జనాలను ఆందోళన పెట్టిస్తున్నాయి.. చాలా మంది వ్యక్తులు కొవిడ్ ప్రోటోకాల్ను గమనించడం లేదు. ఇంట్లో కూడా తమను తాము పరీక్షించుకోవడం…
ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు జీ20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.
G-20 Summit: భారతదేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు జీ20 సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం రాజ్ఘాట్లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో,ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా…
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2022లో యూకే ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి సునక్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి.