PM Modi: భారత్ ఆయుధాలు వాడేది ఆత్మరక్షణకే.. ఆధిపత్యం చెలాయించడం కోసం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకాలోని రామ్లీలా మైదాన్లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, కనీసం ఒక పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిని పెంపొందించడంతో సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈరోజు రావణ దహనం కేవలం దిష్టిబొమ్మ దహనం మాత్రమే కాకుండా కులతత్వం, ప్రాంతీయత పేరుతో ‘మా భారతి’ని విభజించడానికి ప్రయత్నించే శక్తుల గురించి కూడా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. “విజయదశమి పండుగ జాతికి చెందిన ప్రతి దుర్మార్గంపై దేశభక్తి విజయోత్సవ పండుగగా కూడా ఉండాలి. సమాజంలోని చెడులు, వివక్షలను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. అభివృద్ధి పథంలో కొత్త శక్తి, కొత్త తీర్మానాలతో ముందుకు వెళ్తాము. అందరం కలిసి ‘శ్రేష్ఠ భారత్’ని రూపొందిస్తాం’ అని అన్నారు. “విజయదశమి నాడు శస్త్రపూజ చేసే సంప్రదాయం కూడా ఉంది. భారత గడ్డపై ఆయుధాలు పూజించబడడం ఏ భూమిపైనా ఆధిపత్యం కోసం కాదు, సొంత భూమిని కాపాడుకోవడం కోసం. మన శక్తి పూజ మన కోసమే కాదు, సర్వజన క్షేమం కోసం. ప్రపంచం కోసం అని…” ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Also Read: Mohan Bhagwat: మణిపూర్లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణం
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
రామ మందిరంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, “చాలా కాలం నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామజన్మభూమిపై శ్రీరాముని ఆలయాన్ని నిర్మించడం ఈ రోజు మనం అదృష్టవంతులమని, ఇది మన సహనానికి సంకేతం” అని ఆయన అన్నారు.తన ప్రసంగంలో, ప్రధాని మోదీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయడానికి దాని విజయవంతమైన ప్రయత్నాన్ని కూడా ప్రశంసించారు. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన అన్నారు.చంద్రుడిని చేరుకున్నాము. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాము. కొద్ది వారాల క్రితమే కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాము. మహిళా శక్తికి ప్రాతినిధ్యం కల్పించేందుకు, పార్లమెంటు నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించింది,” అని ప్రధాన మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!