Delhi High Court: ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు.
RCB: ఆర్సీబీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ట్రావిస్ హెడ్ నటించిన ఓ యాడ్ తమను కించపరిచేలా ఉందంటూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆ ప్రకటనపై ఎలాంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ సౌరభ్ బెనర్జీ అన్నారు. అది కేవలం క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ప్రకటన అని కోర్టు పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ మధ్య ఓ యాడ్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఉబర్ సంస్థతో…
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఎయిరిండియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ పైలట్ అర్మాన్ (28) గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో అర్మాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సమస్య కారణంగా సహోద్యోగిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
High Court: కస్టమర్ల ఫుడ్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలను చెల్లించడం వారి ఇష్టమని, రెస్టారెంట్లు, హోటళ్లు తప్పనిసరిగా విధించలేవని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులపై సర్వీస్ ఛార్జీలను తప్పనిసరి చేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ, రెస్టారెంట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ తన తీర్పులో.. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదని,…
High Court: ఇటీవల కాలంలో విడాకులు, తప్పుడు కేసులను పేర్కొంటూ భర్తల్ని హింసించే భార్యల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా లేని ‘‘భరణాన్ని’’ డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఇటీవల సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు కీలక వ్యాఖ్యలు చేశాయి. తాజాగా, ఢిల్లీ హైకోర్టు మహిళ దాఖలు చేసిన ‘‘భరణం’’ పిటిషన్పై కామెంట్స్ చేసింది. సంపాదించే సామర్థ్యం ఉన్న, అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుంచి మధ్యంతర భరణాన్ని కోరకూడదని ఢిల్లీ హైకోర్టు…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత మహిళకు ఉరిశిక్ష అమలైంది. చిన్నారి మృతి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ మహిళ షహజాది ఖాన్ను ఉరితీసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల మహిళ నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణపై అబుదాబిలో మరణ శిక్షను ఎదుర్కొన్నది. యుఎఇ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15, 2025న షహజాదీ ఖాన్ను ఉరితీశారని విదేశాంగ మంత్రి కోర్టుకు తెలిపారు.…
దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా యుద్ధం సాగిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది.