Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్…
Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ వెబ్ సైట్లలో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్ మీద తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. హృతిక్ రోషన్ కు సంబంధం లేకుండా వాడుతున్న ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆర్డర్…
ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్ఫ్లిక్స్ షో “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”కు వ్యతిరేకంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో, వాంఖడే షో నిర్మాతలు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమానులు, నటుడు షారుఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్, అలాగే నెట్ఫ్లిక్స్, ఇతరుల నుండి రూ. 2 కోట్ల నష్టపరిహారం కోరాడు. ఈ సిరీస్లో తన పాత్ర…
Akkineni Nagarjuna: టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరు, అభిమానులు టాలీవుడ్ కింగ్ గా పిలుచుకునే అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం.. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఇలా నటులు పిటీషన్ దాఖలు చేయడం కొత్తగా ఏమి కాదు. పర్శనాలిటీ రైట్స్ కోసం గతంలో కూడా ఢిల్లీ హైకోర్టును అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్…
గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్ను అనుమతించడంతో పాటు, “కాపీరైట్ ఉల్లంఘన…
Afzal Guru Grave: ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఉగ్రవాదులు అప్జల్ గురు, మక్బూల్ భట్ సమాధులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కింద నమోదైన ఈ పిటిషన్ను కోర్టు బుధవారం కొట్టేసింది. విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ దాఖలు చేసిన పిల్లో సమాధులు 'తీర్థయాత్ర' స్థలంగా మారాయని పేర్కొంది. అయితే, ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై డేటాను కోరింది.
High Court: తన భర్తని కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోవాలని భార్య ఒత్తిడి చేయడం క్రూరత్వానికి సమానమని, ఒక జంట వివాహాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పదే పదే బహిరంగంగా అవమానించడం, భాగస్వామిని తిట్టడం మానసిక క్రూరత్వమే అని హైకోర్టు పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్పూర్కు చెందిన దర్జీ కన్హయ్యలాల్ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన "ఉదయ్పూర్ ఫైల్స్ - కన్హయ్య లాల్ టైలర్ మర్డర్" సినిమాకు న్యాయపరమైన చిక్కులు…
భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. నిమిషా ఉరిశిక్ష అమలును వాయిదా వేసిన యెమెన్. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది భారత సర్కార్. హత్య కేసులో నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. జూలై 16, బుధవారం ఉరిశిక్ష అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆమె 2017 నుంచి యెమెన్లో జైలులో ఉంది. యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన…