Udaipur Files: “ఉదయ్పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు: సుప్రీంకోర్టు..
- ఉదయ్పూర్ ఫైల్ సినిమాపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..
- హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని ఆదేశం..
- నుపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై వ్యాఖ్యల్ని సమర్థించినందుకు హత్య..
- కన్హయ్యలాల్ అనే దర్జీని హత్య చేసిన ఇద్దరు మతోన్మాదులు..
- ఈ కథాంశం ఆధారంగా నిర్మితమైన ఉదయ్పూర్ ఫైల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్పూర్కు చెందిన దర్జీ కన్హయ్యలాల్ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన “ఉదయ్పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.
అయితే, ఈ సినిమా రిలీజ్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనున జూలై 28న విచారించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. జూలై 21న కేంద్రం సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. కేంద్రం ఉత్తర్వులను సవాల్ చేయడాని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లను ఆదేశించింది. కేంద్రం ఉత్తర్వులతో చిత్ర నిర్మాత సంతృప్తిగా ఉన్నాడని, సుప్రీంలో కేసు కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని, కాబట్టి మీరు హైకోర్టుకు వెళ్లాలని, మా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
Read Also: Bombay High Court: దేశ సమస్యలు వద్దు కానీ, “గాజా” కావాలా.? సీపీఎం పార్టీపై హైకోర్టు ఆగ్రహం..
నిజానికి జూలై 11, 2025లోనే సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలను అడ్డుకోవాలని జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తరుఫున కబిల్ సిబల్, నిందితుల్లో ఒకరి నుంచి వాదిస్తున్న గురుస్వామిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు వీరందర్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అందకుముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి, సినిమాలో కొన్ని సవరణలు, మార్పులను సూచించింది.
హైకోర్టు ఈ కేసును టేకప్ చేసే వరకు స్టే జారీ చేయాలని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీంకోర్టు ఇందులో కలుగజేసుకునేందుకు ఒప్పుకోలేదు. మరోవైపు, చిత్ర నిర్మాతలు కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు సమాజంలో ఎలాంటి అశాంతి చెలరేగలేదనే విషయాన్ని కోర్టు ముందుకు తెచ్చారు. చిన్న విషయాన్ని వారు పెద్దగా చూపిస్తున్నారని కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..