Air India: ఎయిరిండియాలో విషాదం.. గుండెపోటుతో యువ పైలట్ మృతి
- ఎయిరిండియాలో విషాదం
- గుండెపోటుతో యువ పైలట్ మృతి
- ఇటీవలే పైలట్కు వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిరిండియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ పైలట్ అర్మాన్ (28) గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో అర్మాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సమస్య కారణంగా సహోద్యోగిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. తీవ్ర దు:ఖంలో ఉన్న కుటుంబానికి ఓదార్పు లభించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఆ కుటుంబానికి సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ గోప్యతను గౌరవించాలని.. ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అర్మాన్కు ఇటీవలే వివాహం అయింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: పాకిస్తాన్తో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయి.. ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తుంది
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
తాజా ఘటనతో పైలట్ల పని గంటల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఫిబ్రవరిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో విమాన సిబ్బంది అలసటను తగ్గించడానికి పైలట్లు ఎప్పుడు, ఎంతసేపు విమానాలు నడపవచ్చనే దానిపై దశలవారీ రోడ్మ్యాప్ను నివేదించింది. జూలై 1, 2025 నుంచి పైలట్ల వారపు విశ్రాంతిని 36 నుంచి 48 గంటలకు పెంచాలని, నవంబర్ 1, 2025 నుంచి రాత్రిపూట విమాన ప్రయాణాన్ని తగ్గించాలని రోడ్మ్యాప్ ప్రతిపాదించింది. జూలై 1 నుంచి దశలవారీగా విశ్రాంతి సమయాలను కచ్చితంగా అమలు చేయాలని డీజీసీఏకు ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 24న ఆదేశించింది. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: బీహెచ్ఈఎల్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు…
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!