Karnataka: కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తత ఏర్పడింది. బెలగావిలో ఒక దళిత హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి కూర్చోవడాన్ని తప్పుపడుతూ ముస్లిం పురుషుల బృందం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.