దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులు సైబర్ వలలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కోట్లాది రూపాయలు పోగొట్టుకుని లబోదిబో అంటున్నారు.
Digital Arrest : హైదరాబాద్ నగరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు టోకరా వేసిన సంఘటన సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఆమె ఆస్తులన్నీ తాకట్టు పెట్టించి కోట్ల రూపాయల మోసం చేశారు. ఈ కేసులో ప్రముఖ నాట్యాచార్యుడు, పేర్ని రాజ్కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్కుమార్ సైబర్ నేరగాళ్లకు ముల్ అకౌంట్లను (ఫేక్ అకౌంట్లు) అందించడంలో కీలకపాత్ర పోషించినట్టు విచారణలో తేలింది. డిజిటల్ అరెస్ట్ మాయతో ఓ మహిళను మోసం చేసిన నిందితులు…
ప్రస్తుతం ‘సైబర్ నేరగాళ్లు’ ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్ అరెస్టు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్ఫ్రమ్ హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ…
Fake Officers: హైదరాబాద్ నగరంలో మోసాల ముఠా రెచ్చిపోయింది. ట్రస్ట్ లను లక్ష్యంగా చేసుకుని CSR ఫండ్స్ ఇప్పిస్తామని నమ్మించి, పెద్ద మొత్తంలో దోచుకున్న ముఠా గుట్టు మలక్పేట పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నగరంలోని ఓ ట్రస్ట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా.. నకిలీ డాక్యుమెంట్లు, టాస్క్ ఫోర్స్ యూనిఫార్ములతో సినిమా స్టైల్లో మోసానికి పాల్పడింది. ఈ ముఠా సభ్యులు ట్రస్ట్ల వద్దకు వెళ్లి.. మా వల్ల మీరు భారీగా CSR ఫండ్స్ పొందవచ్చు అంటూ నమ్మకం…
Cyber Fraud: మ్యాట్రిమోనీ సైట్లను అడ్డం పెట్టుకుని లేడీ కిలాడీలు రంగంలోకి దిగారు. సైబర్ మోసాలు చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి ఏకంగా లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారికి ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైంది. ఏకంగా అతని వద్ద 22 లక్షలు దోచేశారు. చివరికి నిజం తెలియడంతో ఆ వ్యక్తి ఇప్పుుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్నాళ్లూ లింకులు.. ఓటీపీలు అని చెబుతున్న సైబర్ కేటుగాళ్లు… కొంత పంథా షురూ చేశారు.. ఎక్కడ అవకాశం…
హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786…
Cyber Den: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో సైబర్ నేరాల కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారీ ముఠా పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. భోగాపురంలోని కొన్ని అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా గత రెండేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ప్రధానంగా అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయల మోసాలకు తెగబడింది. ఈ ముఠా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల నుండి యువతీ…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అమాయకులను బురిడీ కొట్టించి అందినకాడికి దోచేస్తు్న్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తు్న్నారు. ఇటీవలికాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఏకంగా న్యాయవాదికే ఝలక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ. 19 లక్షలు కాజేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంకు చెందిన ఓ ప్రముఖ…
Fraud : హబ్సిగూడకు చెందిన ఓ వృద్ధురాలు అశ్రద్ధగా నమ్మిన పరిచయం ఆమె జీవిత savingsనే గుబ్బుచేసింది. 2022లో ఆమెకు నాగేశ్వర శర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఆస్తుల విభాగంలో మేనేజర్గా పనిచేస్తున్నానని చెప్పిన అతను, బ్యాంక్ వేలంలో బంగారం, ఫ్లాట్లు, కార్లు తక్కువ ధరకే లభిస్తాయని వృద్ధురాలిని నమ్మబలికాడు. వృద్ధురాలి నమ్మకాన్ని పూర్తిగా పొందిన నాగేశ్వర శర్మ, ఆమెకు నాలుగు ఫ్లాట్లు, నాలుగు ప్లాట్లు, రెండు కార్లు…
Cyber Fraud : సికింద్రాబాద్లో ఒక మహిళ తన ఫ్లాట్ను అద్దెకు ఇవ్వాలని ఆన్లైన్లో ప్రకటన ఇచ్చింది. క్వికర్ యాప్లో పెట్టిన ఆ ప్రకటనకు ఓ కేటుగాడు కన్నేశాడు. ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారిని అని చెప్పి నమ్మబలికాడు. ఫ్లాట్ చాలా బాగుందని, అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. అంతేకాదు, ఆర్మీ అకౌంటెంట్ త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాడని చెప్పి మరింత నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆర్మీ చెల్లింపులు రివర్స్ మోడ్లో ఉంటాయని,…