Cyber Fraud: బల్క్గా వస్తువులను తక్కువ ధరకు అమ్ముతున్నామని ప్రకటన.. నమ్మారో అంతే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సైబర్ రాబరీ.. ఇప్పుడిదో స్మార్ట్ దోపిడీ. జస్ట్ ఒక్క లింక్.. లేదా ఒక్క ఫోన్ కాల్.. నమ్మారో అంతే..!! ఉన్నదంతా ఊడ్చేస్తారు..!! ఖాతాలో సొమ్ము అంతా ఖాళీ చేసేస్తారు..!! ఇలాంటి మోసమే హైదరాబాద్లో జరిగింది. తాజాగా ఓ వ్యక్తి బల్క్ వస్తువులు తక్కువ ధరకే వస్తున్నాయని నమ్మి.. సైబర్ క్రిమినల్స్ చేతిలో నిండా మోసపోయాడు.
Medha School Drugs: మేధా స్కూల్ లో ఏం జరుగుతోంది? మత్తు మందును కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు?
Also Read
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. అందరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలు..ఫోన్కు లింక్ చేసే ఉన్నాయి. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల స్మార్ట్ దోపిడీకి కీలకంగా మారింది.. సోషల్ మీడియాలో రకరకాల లింకులు పంపిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రూ. 50వేల విలువ చేసే వస్తువులు… రూ. 50కే ఇస్తామంటే ఆశపడని వారు ఎవరుంటారు. అలా ఆశ పడేవారిని ఈజీగా బుట్టలో వేసుకుంటున్నారు. సరిగ్గా హైదరాబాద్లో ఇలాగే జరిగింది. టెలిగ్రామ్లో బల్క్గా వస్తువులను తక్కువ ధరకే అమ్ముతున్నామని సైబర్ క్రిమినల్స్ ఓ లింక్ పోస్ట్ చేశారు. ఆ ప్రకటనను గుడ్డిగా నమ్మిన వ్యాపారి.. వారిని సంప్రదించాడు. ఇంకేముంది.. సైబర్ క్రిమినల్స్.. బాగా నమ్మించి.. అసలు కథ షురూ చేశారు.
The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
మెహిదీపట్నంకు చెందిన ఆ వ్యాపారి.. సైబర్ నేరగాళ్లతో రూ. 80 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, సరుకులు డెలివరీ చేయాలంటే ముందుగా 10 లక్షల అడ్వాన్స్గా చెల్లించాలని సైబర్ నేరగాళ్లు షరతు పెట్టారు. వారి మాటలు నమ్మిన వ్యాపారి ఆ మొత్తాన్ని వారికి పంపించాడు. డబ్బు అందిన తర్వాత కూడా వస్తువులు రాకపోవడంతో అనుమానంతో వారిని ప్రశ్నించాడు. దీంతో వారు మరో నాటకానికి తెరలేపారు. డెలివరీ పూర్తి కావాలంటే అదనంగా మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని మెలికపెట్టారు. చేసేదేమీ లేక ఆ డబ్బు కూడా పంపించాడు. అయినా సరుకులు పంపకుండా, రకరకాల కారణాలు చెబుతూ విడతలవారీగా అతని నుంచి డబ్బు గుంజుతూనే ఉన్నారు. ఇలా మొత్తం 80 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత తాను మోసపోయానని వ్యాపారి గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
-
Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
-
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!