CYBER : సైబర్ క్రిమినల్స్పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల పంజా
- సైబర్ క్రిమినల్స్పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల పంజా
- స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 61 మంది సైబర్ క్రిమినల్స్ పట్టివేత
- తమిళనాడులో 20, గుజరాత్లో18, కర్ణాటకలో16, మహారాష్ట్రలో 13
- ఢిల్లీలో 13, ఆంధ్రప్రదేశ్లో 7, పశ్చిమబెంగాల్లో 8 మంది క్రిమినల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. ఏకంగా 61 మంది సైబర్ క్రిమినల్స్ తాట తీశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి వారిని పట్టుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన అంతరాష్ట్ర ఆపరేషన్లో ఎక్కువమంది సైబర్ క్రిమినల్స్ తమిళనాడు నుంచి పట్టుబడ్డారు. అక్కడ 20 మందిని పట్టుకున్నారు. గుజరాత్లో18, కర్ణాటకలో16, మహారాష్ట్రలో 13, ఢిల్లీలో 13, ఆంధ్రప్రదేశ్లో 7, పశ్చిమబెంగాల్లో 8 మంది ఉన్నారు. ఇక యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, అసోం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి కూడా నిందితులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. నిందితుల నుంచి మొత్తం 50 మొబైల్ ఫోన్లు, 21 చెక్ బుక్స్, 12 పాస్బుక్స్, 51 ఏటీఎం కార్డులు, 7 ల్యాప్టాప్లు, 82 సిమ్ కార్డులు, నకిలీ కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు…
నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా నిందితుల నుంచి వందలాది మోసాల మూలాలు, నిధులు, ఆధారాలు బయటపడ్డాయి. బాధితుల ఖాతాల్లోకి మొత్తం రూ. 1 కోటి 1 లక్షల 39 వేల 338 రూపాయలు తిరిగి జమ చేశారు. ఒక్క ఆగస్టు నెలలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు మొత్తం 338 ఫిర్యాదులు అందాయి. వాటిలో 233 కేసులు ప్రత్యేకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదు అయ్యాయి. మిగిలిన కేసులు జోనల్ సైబర్ సెల్స్కు పంపారు… నిందితులు విభిన్న రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటిలో ట్రేడింగ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కాంలు, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరిట డబ్బులు వసూలు చేశారు. ఓటీపీ ఫ్రాడ్స్, జాబ్ స్కాంలు, బిజినెస్ ఫ్రాడ్స్, కాపీరైట్ ఉల్లంఘనలు వంటి కేసులు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
హైదరాబాద్ తార్నాకకు చెందిన 34 సంవత్సరాల మహిళకు NSE & Coin SSDCX అధికారులుగా నటించిన నిందితులు.. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి పెద్ద లాభాలు ఇప్పిస్తామని మోసం చేశారు. ప్రారంభంలో చిన్న మొత్తాల లాభాలు చూపించి నమ్మకం కలిగించారు. ఆపై మొత్తం రూ. 1.05 కోట్లు మెల్లగా వసూలు చేశారు. ఆన్లైన్ అకౌంట్లో 6 కోట్ల రూపాయలకు పైగా చూపించారు. కానీ ఒక్క రూపాయి కూడా ఆమెకు తిరిగి రాలేదు. ఈ మోసంలో చైనా జాతీయుడు చెన్ చెన్, మరికొంతమంది భారతీయ ముఠా సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. ఫింగర్ ప్రింట్ మెషీన్, స్కానర్, ATM కార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు…
మరో కేసులో 73 ఏళ్ల వృద్ధుడిని షేర్ఖాన్ అధికారి మంజోషి అంటూ వల వేసి.. ఫేక్ ట్రేడింగ్ యాప్, WhatsApp గ్రూప్ ద్వారా మోసం చేశారు. రూ. 22.5 లక్షలు ఆయన పెట్టుబడి పెట్టగా, దానికి ప్రతిఫలంగా రూ. 1.2 కోట్ల లాభం చూపిస్తూ, విత్డ్రా చేసేందుకు రూ. 77 లక్షలు అడిగారు. దీంతో తానే మోసపోయానని గ్రహించిన బాధితుడు.. 1930 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో నిందితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్కు చెందినవారని పోలీసలు గుర్తించారు. కానీ అసలు ముఠా చైనాలో ఉన్నట్లు తేల్చారు.
మరో కేసులో బంజారాహిల్స్కు చెందిన రాధా చైతన్య అనే వ్యక్తికి వాట్సాప్లో వచ్చిన J Strategic Inventors అనే గ్రూప్ ద్వారా ఫేక్ షేర్ మార్కెట్ స్కాం జరిగింది. సుమారు 40,000 పెట్టుబడి పెట్టినా.. వెనక్కు ఒక్క రూపాయి రాలేదు. కాంటాక్ట్ చేసినా నంబర్లు స్విచ్చాఫ్ చేసేశారు. గ్రూప్లో ఇతర కస్టమర్లు కూడా నకిలీ వారేనని తర్వాత బాధితురాలు గ్రహించారు.. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వచ్చే నకిలీ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను నమ్మవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. హెచ్ఆర్డీ, సీబీఐ, ఎన్ఐఏ, రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతో వచ్చే వీడియో కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు బలి కావొద్దని చెబుతున్నారు. ఆన్లైన్ మోసాలు జరిగితే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయాలని కోరుతున్నారు. లేదా cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చంటున్నారు పోలీసులు…
తాజావార్తలు
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!