Cyber Fraud: ప్రాణం తీశారు కదరా.. రిటైర్డ్ అధికారి నుంచి రూ.1.19 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు.. షాక్ లో మృతి
- రిటైర్డ్ అధికారి నుంచి రూ.1.19 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు
- షాక్ లో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోతున్నారు. తాజాగా పూణేలో ఓ రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసి ఏఖంగా రూ. 1.19 కోట్లు కాజేశారు. తన జీవిత కాలంలో దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కొల్లగొట్టారు. సైబర్ క్రిమినల్స్ వేధింపులు, ఆర్థిక నష్టం ఒత్తిడి కారణంగా బాధితుడు అక్టోబర్ 22న ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. మృతుడి భార్య సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read:Komatireddy Venkat Reddy: మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో దెబ్బతిన్న 230 కి.మీ రోడ్లు..!
Also Read
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
FIR ప్రకారం, ఆగస్టు 16న రిటైర్డ్ అధికారికి ఫోన్ కాల్ రావడంతో ఈ ఘోరానికి తెరలేచింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ముంబై పోలీసులలో “ఎన్కౌంటర్ స్పెషలిస్ట్”గా పరిచయం చేసుకున్నాడు. రిటైర్డ్ అధికారి బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్ను ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉపయోగిస్తున్నారని ఆరోపించాడు. ఆ మోసగాడు తరువాత తనను తాను CBI ఢిల్లీ కార్యాలయం నుండి వచ్చిన IPS అధికారిగా పరిచయం చేసుకుని, సహకరించకపోతే ఆ జంటను “హోమ్ అరెస్ట్” లేదా “జైలు అరెస్ట్” చేస్తానని బెదిరించాడు.
Also Read:Rishabh Pant Jersey: కోహ్లీ జెర్సీ ధరించిన రిషభ్ పంత్.. నెట్టింట పలు ఊహాగానాలు!
నిందితుడు వృద్ధుడి ఫోన్ కెమెరాను ఆన్ చేసి, ఆ జంటను మూడు రోజుల పాటు “డిజిటల్ అరెస్ట్”లో ఉంచాడని పూణే సైబర్ పోలీస్ డిసిపి వివేక్ మసల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఆ దంపతుల నుంచి సున్నితమైన ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని పొందారు. దర్యాప్తు ముసుగులో దంపతులను పదే పదే ప్రశ్నించారు. వేధింపులు, ఆర్థిక నష్టం కారణంగా భర్త తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, అది అతని మరణానికి కారణమై ఉండవచ్చని డిసిపి మసల్ నిర్ధారించారు.
తాజావార్తలు
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!