Cyber Fraud: ప్రాణం తీశారు కదరా.. రిటైర్డ్ అధికారి నుంచి రూ.1.19 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు.. షాక్ లో మృతి
- రిటైర్డ్ అధికారి నుంచి రూ.1.19 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు
- షాక్ లో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోతున్నారు. తాజాగా పూణేలో ఓ రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసి ఏఖంగా రూ. 1.19 కోట్లు కాజేశారు. తన జీవిత కాలంలో దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కొల్లగొట్టారు. సైబర్ క్రిమినల్స్ వేధింపులు, ఆర్థిక నష్టం ఒత్తిడి కారణంగా బాధితుడు అక్టోబర్ 22న ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. మృతుడి భార్య సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read:Komatireddy Venkat Reddy: మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో దెబ్బతిన్న 230 కి.మీ రోడ్లు..!
Also Read
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
FIR ప్రకారం, ఆగస్టు 16న రిటైర్డ్ అధికారికి ఫోన్ కాల్ రావడంతో ఈ ఘోరానికి తెరలేచింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ముంబై పోలీసులలో “ఎన్కౌంటర్ స్పెషలిస్ట్”గా పరిచయం చేసుకున్నాడు. రిటైర్డ్ అధికారి బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్ను ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉపయోగిస్తున్నారని ఆరోపించాడు. ఆ మోసగాడు తరువాత తనను తాను CBI ఢిల్లీ కార్యాలయం నుండి వచ్చిన IPS అధికారిగా పరిచయం చేసుకుని, సహకరించకపోతే ఆ జంటను “హోమ్ అరెస్ట్” లేదా “జైలు అరెస్ట్” చేస్తానని బెదిరించాడు.
Also Read:Rishabh Pant Jersey: కోహ్లీ జెర్సీ ధరించిన రిషభ్ పంత్.. నెట్టింట పలు ఊహాగానాలు!
నిందితుడు వృద్ధుడి ఫోన్ కెమెరాను ఆన్ చేసి, ఆ జంటను మూడు రోజుల పాటు “డిజిటల్ అరెస్ట్”లో ఉంచాడని పూణే సైబర్ పోలీస్ డిసిపి వివేక్ మసల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఆ దంపతుల నుంచి సున్నితమైన ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని పొందారు. దర్యాప్తు ముసుగులో దంపతులను పదే పదే ప్రశ్నించారు. వేధింపులు, ఆర్థిక నష్టం కారణంగా భర్త తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, అది అతని మరణానికి కారణమై ఉండవచ్చని డిసిపి మసల్ నిర్ధారించారు.
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!