Deepfake Scam: సద్గురు డీప్ఫేక్ వీడియోతో మహిళ నుండి రూ.3.75 కోట్లు స్వాహా చేసిన స్కామర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepfake Scam: రోజురోజుకి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళను రూ. 3.75 కోట్లకు పైగా మోసం చేశారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు పేరుతో ఉన్న డీప్ఫేక్ వీడియోను నమ్మడమే ఈ మోసానికి కారణమైంది. ఈ ఘటన బెంగుళూరులోని సీవీ రామన్ నగర్లో జరిగింది. బాధితురాలు వర్ష గుప్తా ఫిబ్రవరి 25న తన యూట్యూబ్ ఛానెల్ చూస్తుండగా, సద్గురు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఒక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో ఆమె కంటపడింది. ఆ వీడియోలో, సద్గురు కేవలం 250 అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు పొందవచ్చని చెబుతున్నట్టుగా ఉంది. డీప్ఫేక్ టెక్నాలజీ గురించి తెలియని వర్ష, ఆ వీడియోను నిజమని నమ్మి దాని కింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేసింది.
Charlie Kirk Murder: చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల.. వయస్సు ఎంతంటే ..!
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
లింక్పై క్లిక్ చేసిన వెంటనే, వలీద్ బి అనే వ్యక్తి వర్షను సంప్రదించాడు. తాను ‘మిర్రాక్స్’ అనే ట్రేడింగ్ యాప్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. వలీద్ వివిధ దేశాల ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ ద్వారా ఆమెతో టచ్లో ఉన్నాడు. ఆ తరువాత, ‘మిర్రాక్స్’ యాప్ను డౌన్లోడ్ చేయమని చెప్పి, జూమ్ కాల్స్ ద్వారా ట్రేడింగ్లో శిక్షణ ఇచ్చాడు. వలీద్ అందుబాటులో లేనప్పుడు, మైఖేల్ సి అనే మరొక వ్యక్తి ఆమెకు మార్గదర్శనం చేసేవాడు.
Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ఏ రోజున ఏ అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారంటే!
ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో, మోసగాళ్లు చెప్పినట్లుగా వర్ష తన బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుండి రూ. 3.75 కోట్లను వారికి బదిలీ చేసింది. ఆ తర్వాత డబ్బు మొత్తం కోల్పోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీప్ఫేక్ వీడియోలు ఎంత ప్రమాదకరంగా మారాయో, సైబర్ నేరాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!