Home
Crime
Crime News
-
హైదరాబాద్ లో మరోసారి భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో నివాసంపై ఇవాళ ఎక్సైజ్ పోలీసుల దాడి చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు… వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 17 గ్రాముల కొకైన్ తో పాటు, 8 గ్రాముల ఎండిఎంఏ, 73 ఎస్టకి పిల్స్, 15 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.… -
డెల్టాప్లస్తో చనిపోయిందని నమ్మించి…ఇలా దొరికిపోయాడు…
తిరుపతిలో మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్యకేసులో భర్త శ్రీకాంత్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య భువనేశ్వరీ కరోనా ప్లస్ వేరియంట్తో చికిత్స పొందుతూ చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అనుమానం వచ్చని భువనేశ్వరీ అక్క కూతురు శ్రీకాంత్ రెడ్డి నివశించే అపార్ట్మెంట్కు సంబందించి సీసీటీవీ ఫుటేజ్ను పరీశీలించింది. సీసీటీవీ ఫుటేజ్లో గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. భార్యమృతదేహన్ని సూట్కేసులో ఉంచుకొని బయటకు వస్తున్న దృశ్యాలు, అనంతరం ఖాళీ సూట్కేసుతో ఇంటికి వచ్చిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్లో రికార్డ్… -
అరగంటలో టన్ను చేపలను మాయం చేశారు…ఎలా అంటే…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంకిరెడ్డిగూడెం స్టేజీ సమీపంలో కర్ణాటకలోని బీదర్ కు వెళ్తున్న ఓ చేపల లోడ్ వాహనం టైర్ పంక్చర్ అయింది. టైర్ పంక్చర్ కావడంతో ఆ వాహనం బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డుపై చేపలు పడిపోడంతో వాటిని పట్టుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అంకిరెడ్డిగూడెం స్థానికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు చేపలను పట్టుకోవడాకిని ఎగబడటంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. అరగంట వ్యవధిలోనే రోడ్డుపై పడ్డ టన్ను… -
ఆస్ట్రాలజీ పేరుతో నకిలీ నోట్ల దందా… గుట్టురట్టు చేసిన పోలీసులు…
రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హవాలా దందా చేస్తున్న గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రాలజిస్ట్ గా చెప్పుకుంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగతనం జరిగింది. రూ.40 లక్షల విలువచేసే జాతిరత్నాలు ఛోరికి గురయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో నకిలీ కరెన్సీ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక మురళీకృష్ణ ఇంటో దొంగతనం చేసిన ఆరుగురు దొంగలను అదుపులోకి తీసకొని విచారించగా విషయం బయటపడింది. ఈ… -
కర్నూలు దారుణంః ఒకే కుటుంబంలో…
కర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రతాప్, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక, తానుకూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మానసిక కుంగుబాటుతోనే ప్రతాప్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మాహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకోన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దపల్లి లో దారుణం… కన్న కొడుకుని బావిలో నెట్టేసిన తల్లి
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకునే బావిలో నెట్టి వేసి చంపింది ఓ కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొగల్ పురకు చెందిన బన్ని (14) అనే బాలున్ని… తన కన్న తల్లి శ్యామల వ్యవసాయ బావిలో నెట్టివేసింది. ఈ ఘటనలో బన్ని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దారుణం ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే.. బన్ని మానసిక స్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. read also :… -
మేడ్చల్ లో దారుణం.. ఇద్దరు వైద్యులు చెరువులో దూకి సుసైడ్
మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో ఇద్దరు డాక్టర్లు దూకి సుసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వైద్యులు ఎఫ్ జడ్ బైక్పై వచ్చి..శామీర్పేట్ చెరువలో దూకినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే… వారు చెరువులో దూకే ముందు వారి బైక్, బ్యాగులు, సెల్ ఫోన్లు చెరువు గట్టుపై వదిలేయడంతో వారిని స్థానికులు గుర్తించారు. read more :… -
ఛత్తీస్గడ్లో విచిత్రమైన కేసుః ఆవుపేడ చోరీ చేశారని…
ఛత్తీస్గడ్లో విచిత్రమైన కేసు నమోదైంది. ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని కేసును ఫైల్ చేశారు. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Read: సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ! గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కేంద్రప్రభుత్వం ఆవు పేడను కిలో… -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం…క్షణాల్లో స్పందించిన సిబ్బంది…
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే షాహెన్బాగ్ ఫైఓవర్కు మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకొని క్షణాల్లో పెద్దవిగా మారాయి. వెంటనే స్పందించిన ప్రజలు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ, నోయిడా మార్గంలో ఈ ఫైఓవర్ ఉండటం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వాహనాలను దారిమళ్లించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై… -
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు…టీడీపీ నేతల దారుణ హత్య…
ఆంధ్రపదేశ్లోని కర్నూలు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో టీడీపీ నేతలను ప్రత్యర్ధులు నరికి చంపారు. అడ్డొచ్చిన అనుచరులపై కూడా దాడులు చేశారు. పెసరవాయి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు గురువారం ఉదయం అనుచరులతో కలిసి వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాపపడిన ముగ్గురిని నంధ్యాల ఆసుపత్రికి తరలించి వైద్యం…
తాజావార్తలు
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!
-
Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
-
ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి
-
Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!