లాక్ డౌన్ లో ఆగని లోన్ యాప్స్ ఆగడాలు..7 మంది సూసైడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాక్ డౌన్ లోనూ లోన్ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు. కరోనా సమయంలో కూడా వ్యాపారం చేస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. రెండు సంవత్సరాల్లో 16 వేల రూపాయల లావాదేవీలు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో ఆన్లైన్ లోన్ యాప్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ లో యువతను టార్గెట్ చేసి రుణాలు ఇచ్చిన యాప్ నిర్వాహకులు..ఆన్లైన్ లోన్ యాప్ లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితులు ల్యాంబో సహా 28 మంది అరెస్ట్ అయ్యారు. సుత్రదారి జెన్నిఫర్ కోసం ఇంకా గాలిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూర్ ముంబై, ఢిల్లీలోనూ అధిక బాధితులు ఉన్నారు. నిర్వాహకులు వేదింపులు తాళలేక తెలంగాణలో ఇప్పటికే ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చైనాలో ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్ లుగా పనిచేస్తున్నారు జెన్నిఫర్, వాంగ్ జియాంగ్. ఇద్దరు కలిసి 2019 నవంబర్ లో ఢిల్లీలో మూడు సంస్థలు ప్రారంభించారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బెంగుళూరు బాధ్యతలు చూసుకున్న జీయాంగ్.. గత ఏడాది లాక్ డౌన్ కు ముందు చైనా వెళ్లిపోయారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై బాధ్యతలు ల్యాంబోకి అప్పగించి జకార్తా వెళ్ళాడు జెన్నిఫర్. ఆన్లైన్ లోన్ యాప్ లతో 7 నెలల్లో 30 వేల కోట్లు లావాదేవీలు జరగగా..11 వేల కోట్ల లాభం పొందారు చైనా నిర్వాహకులు. వచ్చిన లాభంతో వర్జిన్ ఐలాండ్ లో ఉన్న బినామీ ఖాతాలోకి నగదు బదిలీ చేశారు. దశల వారీగా వందల కోట్ల రూపాయలు షంఘైకు తరలించారు. ఒక్క రోజులో రూ. 250 కోట్లు రుణంగా నిర్వాహకులు ఇచ్చారు. అయితే.. నిర్వాహకులు ఖాతాలో నుండి రూ. 315 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!