సోషల్ మీడియా పోస్టులపై సీఐడీ దర్యాప్తు …
సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో తమకు తోచిన పోస్టులు పెడుతూ కొంతమంది ప్రైవసీకి విఘాతం కల్పిస్తుంటారు. అలాంటి వారిపై కొన్నిసార్లు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ దర్యాప్తు చేసేందుకు సిద్దమయింది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తుండటంతో, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెడుతున్నారని సీఐడీకి సమాచారం అందడంతో విచారణ చేసేందుకు సిద్దమయింది. రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారనే కోణంలో సీఐడి విచారణ చేస్తున్నది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై పోస్టులు పెట్టడం, లైకులు, కామెంట్స్, ఫార్వార్డ్ చేయడం నేరం అని, సీఐడీ సోషల్ మీడియా, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ దీనిపై లోతైన దర్యాప్తు చేసి, ఎంతటివారైనా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ తెలియజేసింది.
- Tags
- cid
- crime
- Posts
- social media
తాజావార్తలు
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
-
Rice Vadiyalu: అన్నం మిగిలిపోతే అస్సలు పడేయకండి.. ఇలా చేస్తే అదిరిపోయే రైస్ పాపడ్స్ రెడీ అవుతాయ్!
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!