Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో దారుణం జరిగింది. అప్పటి వరకు ఆహ్లాదంగా జరిగిన కుటుంబ కార్యక్రమంతో హత్య జరిగింది. ఫంక్షన్లో డ్యాన్స్ చేయనీకుండా, మ్యూజిక్ ఆపేసినందుకు ఒక వ్యక్తి తన అన్నని గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు ఆదివారం తెలిపారు. కోఠి పోలీస్స్టేషన్ పరిధిలోని మౌహార్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్ కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
UP Crime: ముంబైకి చెందిన ఓ మహిళ ఆరోగ్యం కోసం భూతవైద్యుడిని సంప్రదిస్తే, అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ అంబేద్కర్ నగర్లో జరిగింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మహ్మద్ అష్రఫ్(50)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బాధిత మహిళకు భూతవైద్యం చేస్తున్నాననే నెపంతో గెస్ట్హౌజ్లో బంధించాడు.
Uttar Pradesh: సోదరి కులాంతర వివాహం చేసుకుందని పగ పెంచుకున్న వ్యక్తి, ఆమె భర్తను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్లో చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బిజ్నోర్లోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీరాపూర్ ఖాదర్ గ్రామంలో నిన్న రాత్రి హత్య జరిగింది. బాధితుడిని చాంద్పూర్లో నివాసం ఉంటున్న బ్రజేష్ సింగ్గా గుర్తించారు.
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29)ని అతని తండ్రి రంగ్లాల్(54) దారుణంగా హత్య చేశాడు. గౌరవ్ పెళ్లికి కొన్ని గంటల ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులకు విస్తూపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇంత వరకు కొడుకు తిడుతున్నాడనే కోపంతోనే గౌరవ్ని హత్య చేశాడని భావిస్తున్నప్పటికీ, మరో విషయం వెలుగులోకి వచ్చింది. భార్య తనను విడిచిపెట్టిందనే కోపంతోనే కొడుకును పెళ్లి రోజే చంపినట్లు రంగలాల్ పోలీసులకు వెల్లడించారు. ఈ హత్యకు మూడు…
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29) హత్య సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద ఉండాల్సిన వరుడు హత్యకు గురయ్యాడు. గౌరవ్ సింఘాల్ని అతని తంండ్రి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తండ్రి రంగలాల్ హత్య చేశాడని, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గౌరవ్ తనను రోజూ తిడుతుండే వాడనే కోపంతో రంగలాల్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో గౌరవ్ అతడి…
Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడిని జిమ్ట్రైనర్గా పనిచేసే గౌరవ్ సింఘాల్గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున అతని ముఖం, ఛాతిపై 15 కొత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. అయితే, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌరవ్ తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. హమీర్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాధితురాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాన్పూర్లోని ఘతంపూర్ ప్రాంతంలో ఇసుక బట్టీలో సాహూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి కూతురు, మేనకోడలు కూడా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికలకు బలవంతంగా…
బెంగళూర్లో దారుణం జరిగింది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. ఈ సంఘటన ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జరిగింది. 35 ఏళ్ల మహిళ, 37 ఏళ్ల తన భర్తపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న అతను భార్యను పక్కకు నెట్టేయడంతో బతికిపోయాడు. గాయాలతో ఉన్న అతను ఆస్పత్రికి వెళ్లేందుకు పొరుగువారి సాయం తీసుకున్నాడు. మెడికో లీగల్ కేసు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు.
Man Kills Wife: ఢిల్లీలో దారుణం జరిగింది. 55 ఏళ్ల వ్యక్తి భార్యను హత్య చేసి, నాలుగు రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఈ ఘటన ఘజియాబాద్లో జరిగింది. ఇంట్లో నుంచి భరించలేదని దుర్వాసన రావడంతో నిందితుడు భరత్ సింగ్ ఇంటి ముందు కూర్చుని తన భార్యను చంపినట్లు కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన పొరుగింటి వారితో తన భార్యను చంపేశానని, పోలీసులను పిలవాలని నిందితుడు కోరాడు.