Crime News: అమానుషం.. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను చితకబాదిన కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని గురువులు బోధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకు చదువులు చెప్పించి పెంచుతారు. తనకు తినడానికి ఏమిలేకపోయినా తన పిల్లలకు ఉంటే చాలు అనుకునే తల్లిదండ్రులను నిత్యం చూస్తూ ఉంటాం. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వారిని పెంచి పెద్దచేస్తుంటారు. కానీ కొందరు బిడ్డలు మానవత్వం మర్చిపోయి..తల్లిదండ్రులపై దారుణాలకు తెగబడుతున్నారు. ఆస్తుల కోసం కనిపెంచిన అమ్మానాన్నలపై దాడులకు తెగబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారిని చంపేందుకు కూడా వెనకాడటం లేదు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు..తమ పేగులనే కత్తులతో పొడిచేస్తుంటే.. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
Read ALso: Counselling to RowdySheeters: ఎన్నికల వేళ బెజవాడలో రౌడీ షీటర్లకి పోలీసుల వార్నింగ్
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు. ఎత్తుకుని పెంచిన తల్లి గుండెలపైనే కాలితో తన్నాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెడుతున్నా ఆ కసాయి కొడుకు కనికరించలేదు. కసాయి కొడుకు దెబ్బలకు వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అంతేకాక మరింత రెచ్చిపోయి.. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు కాగా…రెండు ఎకరాల పొలం మరో కుమారుడికి రాస్తావా అంటూ తల్లిదండ్రులపై దాష్టీకం చూపించాడు కుమారుడు శ్రీనివాసులు రెడ్డి. బూతులు తిడుతూ సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లిని ఈడ్చుకుంటా కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై వీడు మనిషేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కొడుకులు పుట్టొందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..