Uttar Pradesh: దొంగలు తెలివిమీరారు. ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు.
Illicit Relationship: చాలా వరకు వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలు హత్యలకు గురైన సంఘటనలను మనం చాలానే చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ సమస్తిపూర్కి చెందిన ఓ వ్యక్తి భార్యతో కాకుండా మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇది తెలుసుకున్న భార్య, ప్రియురాలిని చంపాలని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
Kerala: కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొల్లాం పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై(52), ఆయన భార్య బిందు(48) బలవన్మరణాకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణి అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తించారు. మొరెనా జిల్లాలో 34 ఏళ్ల గర్భిణిపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేందుకు నిప్పటించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిల్లో ప్రాణాల కోసం పోరాడుతోందని పోలీసులు శనివారం తెలిపారు. 80 శాతం గాయాలైన మహిళ గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kota: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు రాజస్థాన్ లోని కోటా నగరం పేరొందింది. ఇలాంటి ప్రాంతంలో వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్కి గురైంది. సహ విద్యార్థులు ఈ దారుణాకి ఒడిగట్టారు. నిందితులు కూడా మైనర్లే అని తెలుస్తోంది. ఫిబ్రవరి 13న జరిగిన ఈ దారుణంలో, నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్కి చెందిన తన క్లాస్మేట్తో స్నేహం చేస్తోంది. అతను బాలికను తన అపార్ట్మెంట్కి పిలిచారు. అక్కడ…
Agra: ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
Rajasthan: రాజస్థాన్లో దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు.
మధ్యప్రదేశ్లో డాక్టర్ నర్సుపై కాల్పులు జరిపాడు. నర్సుగా పనిచేస్తున్న మహిళ వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో డాక్టర్ ఆమెపై కాల్పులు జరిపిన ఘటన బుధవారం జబల్పూర్లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య దీనిపై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డాకర్ట సందీప్ సోని(34), 27 ఏళ్ల మహిళా నర్సుపై గన్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
Man Sets Wife On Fire: మద్యం తాగుతుండగా భార్యభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మద్యం తాగుతున్న సమయంలో భార్య అతడితో వాగ్వాదానికి దిగింది. గొడవ తీవ్రం కావడంతో సదరు వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.
Woman Robs Own Home: ఢిల్లీకి చెందిన ఓ మహిళ సొంతింటికే కన్నం పెట్టింది. బురఖా ధరించి సొంత ఇంటిలో పెళ్లి కోసం ఉంచిన నగలను దోచింది. 31 ఏళ్ల యువతి ఇంట్లోకి చొరబడి నగలు, నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 30న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని సేవర్ పార్క్లోని ఇంట్లో జరిగింది. దీనిపై ఇంటి యజమాని కమలేష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.