Crime News: పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడి దారుణహత్య.. తండ్రిపై అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడిని జిమ్ట్రైనర్గా పనిచేసే గౌరవ్ సింఘాల్గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున అతని ముఖం, ఛాతిపై 15 కొత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. అయితే, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌరవ్ తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
హత్యకు గురైన గౌరవ్ సింఘాల్ తమ్ముడిని, బంధువులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా కనుగొనబడలేదని, బాధితుడికి అతని తండ్రికి మధ్య ఏదో వివాదం ఉందని మాత్రమే తెలుసుకున్నామని, నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతీ విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
Read Also: Radhika Marchant : రాధిక మర్చంట్ ధరించిన ఈ డ్రెస్సును రెడీ చెయ్యడానికి ఎన్నినెలలు పట్టిందో తెలుసా?
డీసీపీ(సౌత్) అంకిత్ చౌహాన్ మాట్లాడుతూ.. సంఘటన గురించి పోలీసులకు అర్దరాత్రి 12.30 గంటలకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి తర్వాత సింఘాల్ కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరణించిన గౌరవ్ సింఘాల్ పెళ్లి ఈ రోజు జరగాల్సి ఉందని, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని డీసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. సింఘాల్ ఫ్యామిలీ మాత్రం తమ కుటుంబంలో ఎవరిపై అనుమానం లేదని చెబుతోంది.
ఈ హత్య గురించి మొత్తం కుటుంబానికి ఎలాంటి క్లూ లేదని, ఇంటి దగ్గర ఢోల్ శబ్ధం ఉండటంతో ఎలాంటి అరుపులు కూడా వినిపించలేదని, పోలీసులు సక్రమంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యుడు జై ప్రకాష్ సింఘాల్ అన్నారు. ముఖం, ఛాతిపై 15 కత్తిపోట్లు ఉండటంతో బాధితుడు అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మరణం వెనక అసలు కారణం తెలుసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నామని, దీనిపై మొత్తం 5 టీములు పనిచేస్తున్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
-
OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!