Uttar Pradesh: అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య.. కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. హమీర్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాధితురాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాన్పూర్లోని ఘతంపూర్ ప్రాంతంలో ఇసుక బట్టీలో సాహూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి కూతురు, మేనకోడలు కూడా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికలకు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబం ఆరోపించిన నేపథ్యంలో ముగ్గురు నిందితులపై కాన్పూర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
Read Also: Bengaluru: బెంగళూరులో వాటర్ సంక్షోభం మరింత తీవ్రం.. సర్కార్ ప్లాన్ ఇదే!
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
గ్యాంగ్ రేప్ కేసులో ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని బాధితురాలి తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఒక చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హమీర్పూర్ ఎస్పీ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు.
కాన్పూర్ అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎక్స్ వేదికగా యోగి సర్కార్పై మండిపడ్డారు. ‘‘కాన్పూర్లో సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాలికల తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబంపై రాజీకి వత్తిడి తెస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ బాధిత బాలికలు, మహిళలు న్యాయం కోసం అడగాలని, ఉన్నావ్, హత్రాస్, కాన్పూర్ వరకు ఎక్కడ స్ట్రీలు హింసించబడ్డారో , వారి కుటుంబాలు కూడా నాశనం చేయబడ్డాయి., చట్టం అనేది లేకండా జంగిల్ రాజ్లో స్ట్రీలు ఉండటం నేరంగా మారింది అని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..