AP Crime: హృదయ విదారకం.. భర్త దారుణ హత్యను చూసి భార్య గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన 59 ఏళ్ల భర్త దారుణ హత్యను చూసిన అనంతరం 56 ఏళ్ల వయస్సు గల భార్య ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించింది.మరణించిన భార్యాభర్తలిద్దరినీ మూర్తి రావు గోఖలే, శోభా గోఖలేగా గుర్తించారు. అనంతపురం వన్టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డెప్ప తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని జేఎన్టీయూ క్యాంపస్ ఎదురుగా ఉన్న ఎల్ఐసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మూర్తి రావు గోఖలే ఎస్కే విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. మృతుడు మూర్తి రావు గోఖలే మేనల్లుడు ఆదిత్యను హంతకుడిగా పోలీసులు గుర్తించారు.
Read Also: Citizenship Amendment Act: సీఏఏ అంటే ఏమిటీ?.. అమలు తర్వాత ఏ మార్పులు జరుగుతాయంటే?
Also Read
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అసలేం జరిగిందంటే.. ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆదిత్య.. ప్రముఖ కంపెనీలో ప్లేస్మెంట్ ఇప్పిస్తానంటే తన మామ మూర్తిరావు గోఖలేకు లంచం ఇచ్చాడు. దీని తరువాత, మూర్తి రావు గోఖలే తన మేనల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. అంటే ఆదిత్యకి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. దీని తర్వాత గోఖలే ఆదిత్య కాల్స్ని తీయడం మానేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆదిత్య తన మామను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఆదిత్య పథకం వేసి ఆదివారం రాత్రి గోఖలే ఇంటికి చేరుకుని అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం ఎంతగా ముదిరిందంటే.. ఆదిత్య గోఖలేపై కత్తితో దాడి చేశాడు. గోఖలే గొంతు కోసి, అతని శరీరంపై కత్తులతో పలుమార్లు పొడిచాడు, ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడు.
ఇంట్లోనే ఉన్న గోఖలే భార్య శోభ తన భర్తను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించగా.. ఆదిత్య ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అయితే భర్త దారుణ హత్యను చూసిన శోభ కొన్ని గంటలకే గుండెపోటుకు గురై మరణించింది. అనంతపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఆదిత్యను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..