Child Pornography Case: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈరోజు (సోమవారం) సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
UP Shocker: యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. విచారణ తర్వాత సొంత కుటుంబమే బాలికను హత్య చేసినట్లు తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే ముగ్గురు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Bengaluru Woman Murder: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్లో మహాలక్ష్మి దాస్ (28) అనే మహిళని దారుణహత్య సంచలనంగా మారింది. ఈ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని వైయాలికావల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా నరికి, ఆమె ఇంట్లోని ఫ్రిజ్ లోనే పెట్టారు. ఫ్రిజ్ కింది షెల్ఫ్లో ఆమె తెగిపడిన తల, పైన కాళ్లు, మధ్య భాగంలో మిగిలిన శరీర భాగాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు
Bengaluru:బెంగళూర్లో దారుణం జరిగింది. 29 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేసి, ఆమె నివాసంలోని ఫ్రిజ్లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనుమానితులు ఎవరు..? అనే వివరాలు తెలియరాలేదు.
MP Horror: మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం 7 నెలల గర్భిణిని ఆమె భర్త, అత్తామామలు దారుణంగా చంపేశారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. నిందితులు బాధితురాలిని కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆమె భర్తతో పాటు అత్తామామలు, ఇద్దరు ఆడపడచులపై కేసు నమోదు చేశారు.
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ మధురలో దళిత బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ముగ్గురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటన తర్వాత బాలికను రోడ్డు పక్కన తోసేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
Bihar Crime: బీహార్లో దారుణం జరిగింది. రాజధాని పాట్నాకు 180 కి.మీ దూరంలోని సహర్సాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గన్తో బెదిరించి బాలికను కారులోకి ఎక్కించుకుని ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను బిట్టు, అంకుష్గా గుర్తించారు. శనివారం ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Fraud: హిందువుగా నటించి ఓ మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల వ్యక్తి హిందువుగా చెప్పుకుంటూ మోసం చేశాడు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని సదరు మహిళని బలవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బారాబంకీలో…
Coimbatore: ప్రియుడితో లాడ్జ్కి వెళ్లిన యువతి శవమై కనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటుచేసుకుంది. లాడ్జిలో ముఖంపై రక్తంతో యువతి కనిపించినట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. రెండు రోజుల క్రితం యువతి, తన భాగస్వామితో లాడ్జికి వెళ్లింది. ప్రాథమికి నివేదికల ప్రకారం.. గీత అనే యువతి శుక్రవారం రాత్రి శరవణన్ అనే వ్యక్తితో కలిసి లాడ్జ్లో రూం