Gujarat Gang-Rape: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. విచారణ సమయంలో నిందితుడి మృతి..
- గుజరాత్ టీనేజ్ బాలిక అత్యాచారం కేసు..
- నిందితుల్లో ఒకరి మృతి..
- పోలీస్ విచారణలో తీవ్ర అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. బుధవారం వీరిని అరెస్ట్ చేశారు.
‘‘ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చౌరాసియా శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన మరణించాడు’’ అని సూరత్ జిల్లా ఎస్పీ హితేష్ జోయ్సర్ చెప్పారు. పాశ్వాన్ని రిమాండ్ కోరుతూ ఈ రోజు సాయంత్రం కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
Read Also: Ratan Tata family tree: రతన్ టాటా ‘‘వంశ వృక్షం’’ ఇదే.. ఎవరికి టాటా గ్రూప్ దక్కుతుంది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశ్వాన్, చౌరాసియాతో పాటు మరో నిందితుడు మంగళవారం రాత్రి మంగ్రోల్ తాలుకాలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. టీనేజర్ తన కోచింగ్ క్లాస్కి హాజరై, తన స్నేహితుడిని కలవడానికి కిమ్ గ్రామానికి వెళ్లింది. బాలిక, ఆమె మగ స్నేహితుడు మోటా బోర్సారా గ్రామ సమీపంలోకి రాగానే మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో కూర్చొని ఉండగా, ముగ్గురు నిందితులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలికపై అత్యాచారం చేసిన నిందితులు, వీరిద్దరి మొబైల్ ఫోన్లను తీసుకుని పారిపోయారు. ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద సామూహిక అత్యాచారం మరియు ఇతర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితులు పాశ్వాన్, చౌరాసియా పట్టుబడ్డారు. అంక్లేశ్వర్, కడోదర, అమీర్గఢ్, కర్జన్ వంటి ప్రాంతాల్లో ఇద్దరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చౌరాసియాపై 2017లో అంక్లేశ్వర్లో హత్య కేసు, 2023లో కర్జన్లో దొంగతనం కేసు నమోదైంది. ఈ సంవత్సరం, బనస్కాంతలోని అమీర్గఢ్ పోలీస్ స్టేషన్ అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!