Gujarat Gang-Rape: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. విచారణ సమయంలో నిందితుడి మృతి..
- గుజరాత్ టీనేజ్ బాలిక అత్యాచారం కేసు..
- నిందితుల్లో ఒకరి మృతి..
- పోలీస్ విచారణలో తీవ్ర అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. బుధవారం వీరిని అరెస్ట్ చేశారు.
‘‘ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చౌరాసియా శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన మరణించాడు’’ అని సూరత్ జిల్లా ఎస్పీ హితేష్ జోయ్సర్ చెప్పారు. పాశ్వాన్ని రిమాండ్ కోరుతూ ఈ రోజు సాయంత్రం కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
Read Also: Ratan Tata family tree: రతన్ టాటా ‘‘వంశ వృక్షం’’ ఇదే.. ఎవరికి టాటా గ్రూప్ దక్కుతుంది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశ్వాన్, చౌరాసియాతో పాటు మరో నిందితుడు మంగళవారం రాత్రి మంగ్రోల్ తాలుకాలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. టీనేజర్ తన కోచింగ్ క్లాస్కి హాజరై, తన స్నేహితుడిని కలవడానికి కిమ్ గ్రామానికి వెళ్లింది. బాలిక, ఆమె మగ స్నేహితుడు మోటా బోర్సారా గ్రామ సమీపంలోకి రాగానే మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో కూర్చొని ఉండగా, ముగ్గురు నిందితులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలికపై అత్యాచారం చేసిన నిందితులు, వీరిద్దరి మొబైల్ ఫోన్లను తీసుకుని పారిపోయారు. ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద సామూహిక అత్యాచారం మరియు ఇతర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితులు పాశ్వాన్, చౌరాసియా పట్టుబడ్డారు. అంక్లేశ్వర్, కడోదర, అమీర్గఢ్, కర్జన్ వంటి ప్రాంతాల్లో ఇద్దరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చౌరాసియాపై 2017లో అంక్లేశ్వర్లో హత్య కేసు, 2023లో కర్జన్లో దొంగతనం కేసు నమోదైంది. ఈ సంవత్సరం, బనస్కాంతలోని అమీర్గఢ్ పోలీస్ స్టేషన్ అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..