Gujarat Gang-Rape: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. విచారణ సమయంలో నిందితుడి మృతి..
- గుజరాత్ టీనేజ్ బాలిక అత్యాచారం కేసు..
- నిందితుల్లో ఒకరి మృతి..
- పోలీస్ విచారణలో తీవ్ర అస్వస్థత..
Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. బుధవారం వీరిని అరెస్ట్ చేశారు.
‘‘ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చౌరాసియా శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన మరణించాడు’’ అని సూరత్ జిల్లా ఎస్పీ హితేష్ జోయ్సర్ చెప్పారు. పాశ్వాన్ని రిమాండ్ కోరుతూ ఈ రోజు సాయంత్రం కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.
Also Read
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
Read Also: Ratan Tata family tree: రతన్ టాటా ‘‘వంశ వృక్షం’’ ఇదే.. ఎవరికి టాటా గ్రూప్ దక్కుతుంది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశ్వాన్, చౌరాసియాతో పాటు మరో నిందితుడు మంగళవారం రాత్రి మంగ్రోల్ తాలుకాలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. టీనేజర్ తన కోచింగ్ క్లాస్కి హాజరై, తన స్నేహితుడిని కలవడానికి కిమ్ గ్రామానికి వెళ్లింది. బాలిక, ఆమె మగ స్నేహితుడు మోటా బోర్సారా గ్రామ సమీపంలోకి రాగానే మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో కూర్చొని ఉండగా, ముగ్గురు నిందితులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలికపై అత్యాచారం చేసిన నిందితులు, వీరిద్దరి మొబైల్ ఫోన్లను తీసుకుని పారిపోయారు. ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద సామూహిక అత్యాచారం మరియు ఇతర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితులు పాశ్వాన్, చౌరాసియా పట్టుబడ్డారు. అంక్లేశ్వర్, కడోదర, అమీర్గఢ్, కర్జన్ వంటి ప్రాంతాల్లో ఇద్దరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చౌరాసియాపై 2017లో అంక్లేశ్వర్లో హత్య కేసు, 2023లో కర్జన్లో దొంగతనం కేసు నమోదైంది. ఈ సంవత్సరం, బనస్కాంతలోని అమీర్గఢ్ పోలీస్ స్టేషన్ అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!
-
JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
-
Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!