Karnataka: కర్ణాటకలో బీదర్లో 18 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసుకి సంబంధించి పోలీసులకు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. యువతి ఆగస్టు 29న తప్పిపోయింది, సెప్టెంబర్ 01న గుణతీర్థవాడిలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని పొదల్లో ఆమె మృతదేహం లభించింది.
చైనా, పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టిన మాజీ సైనికుడిని కొట్టి చంపాడు. 93 ఏళ్ల వృద్ధుడు తన మనవడికి పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మనవడు తాతను కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Wife Harassment: భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న వీడియోని రికార్డ్ చేశాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. తాను పెళ్లి వల్ల ఎంత నరకం అనుభవించానే విషయాన్ని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంటనీరు తెప్పిస్తోంది.
Crime: దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కోల్కతా డాక్టర్ ఘటన ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే పలు ప్రాంతాల్లో బాలికలు, మహిళలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. చాలా వరకు లైంగిక దాడులు తెలిసిన వారి నుంచే జరుగుతున్నాయి.
Delhi Crime: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నైరుతి ఢిల్లీలో ఈ ఘటన జరిగినట్లు పోలీస్ అధికారి శనివారం తెలిపారు. కూలి పని చేసే బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం పంపించారు.
UP Crime: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కఠినమైన అత్యాచార చట్టాలు, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల్లో భయం కలగడం లేదు. ఇటీవల కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేశారు. మహిళల రక్షణకు మరింత కఠినమైన చట్టాలు రావాలని కోరారు.
Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.
బెంగళూరులో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
Bihar: బీహార్ అరారియాలో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లో కారం పొడి పోసి దాడి చేయడం వైరల్గా మారింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడ్డాడనే అభియోగంపై కొందరు బాధితుడి చేతులు వెనకకు కట్టి, ప్యాంట్ విప్పి, అతడి ప్రైవేట్ పార్టులో కారం పోసి, కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.