Kolkata: జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష.. ఒకరి పరిస్థితి విషమం
- ఆర్జీ కర్ ప్రభుత్వ హస్పటల్ కేసులో జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష..
- ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమం..
- జూనియర్ డాక్టర్ అనికేత్ మహతోకి హస్పటల్లో కొనసాగుతున్న చికిత్స
Kolkata: పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో (శుక్రవారం) ఆరో రోజుకు చేరుకుంది. కాగా, ఈ దీక్షలో పాల్గొన్న వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని హస్పటల్ కి చెందిన అధికారులు తెలిపారు.
Read Also: Bhatti Vikramarka: ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది..
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
కాగా, కొందరు ట్రైనీ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వారిలో ఒకరైన అనికేత్ మహతో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుంది. దీంతో గురువారం రాత్రి అతడిని హస్పటల్ కి తరలించి ట్రిట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అనికేత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడే, నిరాహార దీక్షలో పాల్గొన్న మరో ఆరుగురు డాక్టర్లు ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నట్లు ట్రైనీ వైద్యులు పేర్కొన్నారు. వారికి వెంటనే వైద్యం అందించడానికి దీక్ష ప్రాంతంలో ఐసీయూ అంబులెన్స్, ఇతర వైద్య పరికరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Read Also: Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది..
ఇక, తమ డిమాండ్లను బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించే వరకు తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఈ దీక్షలో పాల్గొన్న వైద్యుల్లో ఎవరికి ఏం జరిగినా దానికి మమతా సర్కార్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అలాగే, నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వైద్యుల ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ యువ వైద్యులే మన భవిష్యత్తు.. వీరు న్యాయం కోసం దీక్ష చేస్తున్నా.. ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!