Kolkata: జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష.. ఒకరి పరిస్థితి విషమం
- ఆర్జీ కర్ ప్రభుత్వ హస్పటల్ కేసులో జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష..
- ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమం..
- జూనియర్ డాక్టర్ అనికేత్ మహతోకి హస్పటల్లో కొనసాగుతున్న చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో (శుక్రవారం) ఆరో రోజుకు చేరుకుంది. కాగా, ఈ దీక్షలో పాల్గొన్న వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని హస్పటల్ కి చెందిన అధికారులు తెలిపారు.
Read Also: Bhatti Vikramarka: ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
కాగా, కొందరు ట్రైనీ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వారిలో ఒకరైన అనికేత్ మహతో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుంది. దీంతో గురువారం రాత్రి అతడిని హస్పటల్ కి తరలించి ట్రిట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అనికేత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడే, నిరాహార దీక్షలో పాల్గొన్న మరో ఆరుగురు డాక్టర్లు ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నట్లు ట్రైనీ వైద్యులు పేర్కొన్నారు. వారికి వెంటనే వైద్యం అందించడానికి దీక్ష ప్రాంతంలో ఐసీయూ అంబులెన్స్, ఇతర వైద్య పరికరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Read Also: Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది..
ఇక, తమ డిమాండ్లను బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించే వరకు తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఈ దీక్షలో పాల్గొన్న వైద్యుల్లో ఎవరికి ఏం జరిగినా దానికి మమతా సర్కార్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అలాగే, నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వైద్యుల ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ యువ వైద్యులే మన భవిష్యత్తు.. వీరు న్యాయం కోసం దీక్ష చేస్తున్నా.. ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!