Home
Crime
Crime News
-
Crime: పిల్లల ముందే భార్యని క్రూరంగా కొట్టి చంపిన కసాయి..
Crime: బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. పిల్లల ముందే ఓ కసాయి భర్త తన భార్యను కొట్టి చంపాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింగా గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు. -
Nose pin: ‘‘ముక్కు పుడక’’ హంతకుడిని పట్టించింది.. భార్యని చంపిన ఢిల్లీ వ్యాపారి..
Nose pin: భార్యని చంపి, మురికి కాలువలో మృతదేహాన్ని పడేసిన కేసులో భర్త నిందితుడిగా తేలాడు. దాదాపు నెల రోజుల క్రితం ఢిల్లీలోని ఒక మురికి కాలువలో ఒక మహిళ మృతదేహం లభించింది. అయితే, ఈ కేసును పరిష్కరించడానికి పోలీసులకు మహిళ ‘‘ముక్కుపుడక’’ సాయం చేసింది. దీని ఆధారంగా దర్యాప్తు చేయగా భర్త అనిల్ కుమార్ని నిందితుడిగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
UP: పెళ్లికి ముందు కాబోయే అత్తగారితో కలిసి అల్లుడు జంప్!
'వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..' ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలోని మద్రక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లుడు తన పెళ్లికి ముందే తన కాబోయే అత్తగారితో పారిపోయాడు. ఈ సంఘటన… -
UP: మీరట్ తరహా మర్డర్.. “ప్రభుత్వ ఉద్యోగం” కోసం భర్తని హత్య చేసిన భార్య..
UP: ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ పట్టణంలో ‘‘మీరట్’’ తరహా మర్డర్ సంచలనంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్యనే భర్తను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిజ్నోర్ నజీబాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. రైల్వే టెక్నీషియన్గా పనిచేస్తున్న దీపక్ కుమార్ని అతడి భార్య శివాని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భర్త గుండెపోటుతో మరణించినట్లు ముందుగా శివాని చెప్పింది. Read Also: Punjab: బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి.. పాకిస్తానీతో సహా… -
Theft: “మంచి దొంగ”.. రామనవమి రోజు దొంగతనం చేసి, క్షమించాలని లేఖ..
Theft: మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి, దొంగతనం చేసిన క్షమించాలని కోరుతూ లేఖ రాశాడు. ఖార్గోన్ జిల్లాలో ఒక దుకాణం నుంచి రూ. 2.45 లక్షలు దొంగలించిన వ్యక్తి, ‘‘రామ నవమి’’ రోజు దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరాడు. అప్పులతో ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఆరు నెలల్లో దొంగిలిచిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చాడని సోమవారం పోలీస్ అధికారులు చెప్పారు. -
UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..
UP: తనపై 20 మందికి పైగా వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగింది. యూపీ పోలీసులు 23 మంది పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 11 మంది గుర్తు తెలియని వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Badminton coach: 16 ఏళ్ల బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం.. మొబైల్లో బాలికల నగ్న చిత్రాలు..
Badminton coach: బెంగళూర్కి చెందిన ఒక బ్యాడ్మింటన్ కోచ్ 16 ఏళ్ల మైనర్ బాలికపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఫోన్లో 7-8 మంది బాలిక అభ్యంతరకమైన చిత్రాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల నిందితుడు హులిమావులోని బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బాధిత బాలిక గత రెండు ఏళ్లుగా అక్కడే శిక్షణ పొందుతోంది. -
Bengaluru: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన భర్త..
Bengaluru: బెంగళూర్లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి ఒక వీధిలో నడిరోడ్డుపై భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని 43 ఏళ్ల కృష్ణప్పగా గుర్తించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. -
UP: “మీరట్ మర్డర్” వీడియోలు పంపుతూ భార్యకు బెదిరింపులు..
UP: ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్పుత్ అనే వ్యక్తిని అతడి భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్ వేసి కప్పేశారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్ తన కుమార్తె బర్త్ డేకి ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. Read Also:… -
Fake Doctor: దారుణం.. హార్ట్ సర్జరీలు చేసిన “ఫేక్ డాక్టర్”.. ఏడుగురి మృతి..
Fake Doctor: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ డాక్టర్, కార్డియాలజిస్ట్ని అని చెప్పుకుంటూ పలువురు రోగులకు సర్జరీలు చేశాడు. ఈ ఘటనలో సర్జరీలు ముగిసిన తర్వాత ఏడుగురు పెషెంట్లు మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దామోహ్ నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. నకిలీ డాక్టర్ వైద్యం చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించి, విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
-
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
-
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
-
Police Complaint Director: వారి వల్లే వరలక్ష్మికి సారీ చెప్పా.. సమస్య సద్దుమణగలేదు!
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!