Acid Attack: “నువ్వు నాకు దక్కకపోతే, ఎవరికి దక్కొద్దు”.. పెళ్లికి ముందు యువతిపై యాసిడ్ దాడి..
- ‘‘నువ్వు నాకు దక్కకుంటే, ఎవరికి దక్కద్దు’’..
- పెళ్లికి ముందు యువతిపై యాసిడ్ దాడి..
- ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: మరికొన్ని రోజుల్లో యువతి పెళ్లి, ఇంతలోనే ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ చెందిన 25 ఏళ్ల యువతిపై ఒక యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆపి ‘‘నువ్వు నాకు దక్కకుంటే, మరెవరికి దక్కకూడదు’’ అంటూ ఆమెపై యాసిడ్ పోశారు. ఉత్తర్ ప్రదేశ్ మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బాధితురాలు, ఆమె కుటుంబం వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆమె తండి చనిపోవడం, సోదరుడు చిన్నవాడు కావడంతో యువతి సొంతగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటోంది. అయితే, యువతితో రిలేషన్లో ఉన్న నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్, ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
Read Also: Pakistan: సింధు నది పేరుతో, పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం..
గురువారం యువతి బ్యాంక్ నుంచి రూ. 20,000 డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మే 27న ఆమె పెళ్లిని ఆపాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. యువతి ముఖం, భుజం, మెడ, శరీరంపై ఇతర భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత ఆమెను గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అజంగఢ్ లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 60 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు చెప్పారు.
నిందితుడు పటేల్తో పాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, ఆమె వివాహం రద్దు అయింది. యువతి వివాహాన్ని అడ్డుకునేందుకు ఆమె వీపుపై యాసిడ్ పోయాలని అనుకున్నట్లు నిందితుడు పోలీసులతో చెప్పాడు. గత నెలలో యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య వివాహ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ దాడి చేశాడు.
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..