Acid Attack: “నువ్వు నాకు దక్కకపోతే, ఎవరికి దక్కొద్దు”.. పెళ్లికి ముందు యువతిపై యాసిడ్ దాడి..
- ‘‘నువ్వు నాకు దక్కకుంటే, ఎవరికి దక్కద్దు’’..
- పెళ్లికి ముందు యువతిపై యాసిడ్ దాడి..
- ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: మరికొన్ని రోజుల్లో యువతి పెళ్లి, ఇంతలోనే ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ చెందిన 25 ఏళ్ల యువతిపై ఒక యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆపి ‘‘నువ్వు నాకు దక్కకుంటే, మరెవరికి దక్కకూడదు’’ అంటూ ఆమెపై యాసిడ్ పోశారు. ఉత్తర్ ప్రదేశ్ మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బాధితురాలు, ఆమె కుటుంబం వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆమె తండి చనిపోవడం, సోదరుడు చిన్నవాడు కావడంతో యువతి సొంతగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటోంది. అయితే, యువతితో రిలేషన్లో ఉన్న నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్, ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Pakistan: సింధు నది పేరుతో, పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం..
గురువారం యువతి బ్యాంక్ నుంచి రూ. 20,000 డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మే 27న ఆమె పెళ్లిని ఆపాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. యువతి ముఖం, భుజం, మెడ, శరీరంపై ఇతర భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత ఆమెను గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అజంగఢ్ లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 60 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు చెప్పారు.
నిందితుడు పటేల్తో పాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, ఆమె వివాహం రద్దు అయింది. యువతి వివాహాన్ని అడ్డుకునేందుకు ఆమె వీపుపై యాసిడ్ పోయాలని అనుకున్నట్లు నిందితుడు పోలీసులతో చెప్పాడు. గత నెలలో యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య వివాహ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ దాడి చేశాడు.
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!