UP News: తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్సయిందని అతను బాధ పడుతుంటే, భార్య మాత్రం తన లవర్లో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్లో జరిగింది. రోరావర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శివ శంకర్ గుప్తా కూడా తమకు ఫిర్యాదు అందినట్లు ధ్రువీకరించారు.
Read Also: Crime: అక్రమ సంబంధం అనుమానంతో భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడి..
షకీర్ ఇటీవల తన కుటుంబ సభ్యుల వివాహం కోసం బయటకు వెళ్లాడు. ఏప్రిల్ 25న తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు, తన భార్య నలుగురు పిల్లలు కనిపించలేదు. దీంతో అతను మిస్సింగ్ కంఫ్లైంట్ నమోదు చేశాడు. తాము జోక్యం చేసుకునే లోపే ఇంటి నుంచి విలువైన వస్తువులు తీసుకెళ్లి పోయిందని ఇరుగుపొరుగు వారు చెప్పారు.
షకీర్ తన భార్య గురించి కొన్ని రోజులు వెతికిన తర్వాత, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అతను బంధువు వాట్సాప్ ద్వారా పంపిన ఫోటోని చూసిన షకీర్ షాకయ్యాడు. తన భార్య అంజుమ్, లవర్తో కలిసి తాజ్మహల్ వద్ద ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తాను పనిచేసే చోటే, అంజమ్తో సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడా పనిచేస్తున్నట్లు షకీర్ గుర్తించాడు. అలీఘర్ పోలీసులు ఆగ్రా పోలీసుల్ని అంజుమ్ గురించి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆ జంట కోసం పోలీసులు వెతుకుతున్నారు.