Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- అక్కాచెల్లెళ్లపై అత్యాచారం..
- వీడియోలు తీసి బ్లాక్మెయిల్..
- ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
Read Also: Putin: ‘‘షరతులు లేకుండా చర్చలకు సిద్ధం’’.. ఉక్రెయిన్కి పుతిన్ సందేశం..
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
2022లో కాలేజీలో చదువుతున్న సమయంలో ఫర్హాన్తో స్నేహం చేశానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఒక రోజు ఫర్హాన్ తనను జహంగీరాబాద్లోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ ఇద్దరం శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పింది. దీనిని అతను రికార్డ్ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత ఈ వీడియోని ఉపయోగించి తనను బెదిరించాడని, ఇస్లాం మతంలోకి మారి వారి ఆచారాలను పాటించకపోతే వీడియోని వైరల్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో చెప్పింది.
ఫర్హాన్, అతడి స్నేహితుడు బెదిరించిన రికార్డింగులను పోలీసులకు ఆధారాలుగా అందించింది. ఫర్హాన్ తన చెల్లిని కూడా లక్ష్యంగా చేసుకున్నాడని ఆమె చెప్పింది. ఇద్దరు నిందితులు కూడా ఆమెను లైంగిక చర్యల కోసం బలవంతం చేశారని, ఈ సంఘటనల సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ఓ వ్యక్తితో పంచుకోవడంతో పోలీసులు ఈ కేసు గురించి తెలుసుకున్నారు. మహిళకు చాలా రోజులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె గుర్తింపు బయటపడకుండా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు మొదట నిందితులందరి స్థానాన్ని గుర్తించి, ఆపై వారిని అరెస్టు చేశారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మరింత దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!