మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్ ఘటనలో వైద్య సిబ్బందిపై వేటు పడింది. ఏడుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు నర్సులు, ఎఫ్ఎన్వో, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై జరిగిన అత్యాచారం ఘటన బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐదు నెలల పాపపై 40 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
కడప జిల్లాలో కులహంకార దాడి ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభాకర్ అనే వ్యక్తిపై గజ్జల సుబ్బారెడ్డి అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో పాటు మరిగే నూనెను పోసినట్లు తెలిసింది. కదిరి ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్కు తరలించారు.
డ్రగ్స్ స్మగ్లింగ్కు సంబంధించిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చిన టాంజానియా దేశానికి చెందిన ఓ యువతికి ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. 2021వ సంవత్సరంలో టాంజానియాకు చెందిన ఓ యువతి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చింది.
Viral Video: ఉత్తర్ ప్రదేశ్లో ఓ యువకుడికి తాలిబాన్ తరహా శిక్ష విధించారు. అమ్రోహా జిల్లాలో ఈ అవమానకరమైన ఘటన జరిగింది. యువకుడి మొహానికి నల్లరంగు పూసి, సగం గుండు కొరిగించి, మెడలో చెప్పు దండ వేసి ఊరేగించారు.
ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ ఫామ్హౌస్లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కేకే ఫామ్హౌస్లో కమ్మరి కృష్ణను కొందరు దుండగులు దారుణంగా హత్యకు చేశారు.
Ghazipur Triple Murder: గత రెండేళ్లుగా ప్రేమిస్తున్న తన స్రేయసితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను, సోదరుడిని అత్యంత దారుణంగా 15 ఏళ్ల బాలుడు హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
TDP Worker Killed: అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను దారుణ హత్య చేశారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షిణారహితంగా పొడిచి చంపి.. మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు.