పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ప్రేమించిన యువతి గొంతుకోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామగుండం 8ఎంక్లైన్ కేకే నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కేకే నగర్ లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమ పేరుతో రాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెనుక గత కొంతకాలంగా తిరుగుతుండగా.. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో…
కూంబింగ్ నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబి ట్రాప్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబి ట్రాప్ లు మావోయిస్టులు అమర్చారు. కూబింగ్ చేసే పోలీస్ బలగాలు లక్ష్యంగా ఏడు చోట్ల పదునైన వెదురు కర్రలతో బూబి ట్రాప్లను మావోలు ఏర్పాటు చేశారు. కానీ… చింతూరు డివిజన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బూబి ట్రాప్ లను గుర్తించి ధ్వంసం చేశారు. కాలిబాటల్లో గోతులు తవ్వి పదునైన వెదురు కర్రలతో…
ప్రస్తుత్రం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు తమకు వచ్చిన టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు టిక్ టాక్ వచ్చి ఎంతోమందిని చెడగొట్టింది. అది బ్యాన్ చేయడంతో ప్రస్తుతం అందరు యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ అంటూ చెత్త చేత వీడియోలను పెడుతూ లైక్స్ కోసం ఎగబడుతున్నారు. తాజగా ఒక మహిళ యూట్యూబ్ వీడియోల మోజులో పడి జైలుపాలైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.…
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.. తన భర్తను తానే చంపానని ఒక భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఆమె తన భర్తను ఎందుకు చంపాల్సివచ్చిందో చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత ఆదివారం జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు దారుణమైన నిజాలను బయటపెట్టారు. వివరాలలోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు ఆర్జించాడు. ఆ డబ్బుతో విలాసంగా జీవిస్తున్నాడు. అతడికి…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకొంది. అనుమానాస్పద స్థితిలో ఒక డాన్సర్ మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫలక్ నుమా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తఫా నగర్ లో నివాసముంటున్న షరీఫ్ ఫాతిమా(30) ఆర్కెస్ట్రా గ్రూప్ లో డాన్సర్ గా పనిచేస్తోంది. ఇటీవలే భర్త చనిపోవడంతో తన పిల్లల్తో కలిసి నివసిస్తోంది. ఇక ఇటీవలే ఆమె ఫలక్ నుమా పరిధిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవడానికి…
ఎన్నో ఆశలతో ఆ జంట నగరంలో అడుగుపెట్టింది. పెళ్లై 15 రోజులు.. కొత్త కాపురం.. భార్యను వదిలి జాబ్ కి వెళ్లాలంటే ఏ భర్తకైనా మనసు ఒప్పదు… కానీ, వెళ్లకపోతే జాబే ఉండదు కాబట్టి తెగించాడు భర్త.. అదే అతడు చేసిన తప్పు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలి నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఎలాగోలా ఆ రాత్రి ముగించుకొని తెల్లారి భార్య కోసం పరుగుపరుగున ఇంటికి వచ్చి డోర్ తీశాడు. అంతే.. అతడి కళ్లను అతడే…
ఆ ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా పెరగక పోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇలా ఉన్న ఆ ఇద్దరు జీవితంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. ప్రేమ పేరుతో ఇద్దరికి దగ్గరయ్యాడు. దీంతో అతడి వలన వీరి స్నేహం వైరంగా మారింది. ఎక్కడివరకు అంటే స్నేహితురాలిని కూడా చంపడానికి వెనకాడనంత.. ప్రేమించినవాడు తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతిపై దాడి చేసింది మరో యువతి.. ఈ దారుణ ఘటన…
మంత్రి తలసాని కుమారుడిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఖైరతాబాద్లో జరుగుతున్న సదర్ ఉత్సవాలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారు తలసాని సాయికిర్ణ్ తన కారులో వచ్చారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ వస్తుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇందిరానగర్కు చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి పాదం పై నుంచి ఆయన కారు పోవడంతో ఆ వ్యక్తి గాయాలయ్యాయి. దీంతో సదరు బాధితుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తలసాని సాయికిరణ్పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు…
ఛత్తీస్ఘడ్లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం నలుగురిని కిడ్నాప్ చేయగా, శనివారం మరో గ్రామస్థుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన గ్రామస్థుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్రామస్తులందరినీ సురక్షితంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేసింది.
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జైలు రణరంగంగా మారింది. తోటి ఖైదీ మరణించిన వార్త విన్న ఖైదీలు ఆవేశంతో జైలు సిబ్బందిపై దాడికి దిగి జైలుకు నిప్పుపెట్టారు. అంతేకాకుండా జైలర్ను నిర్బంధించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సందీప్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్నాడు. ఈ మధ్య సందీప్ డెంగీ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సైఫాయి ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఈనేపథ్యంలో సైఫాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించారు. ఈ…