భారత్లో జరగనున్న వన్డే క్రికెట్ ప్రపంచకప్కు శ్రీలంక తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో జింబాబ్వేను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక ఈ ఘనత సాధించింది. బులవాయోలో జరిగిన మ్యాచ్లో శ్రీలంకకు ఆతిథ్య జట్టు ఇచ్చిన 166 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్ బ్యాట్స్మెన్ పాతుమ్ నిశాంక అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు ప్రకటనపై పలువురు మాజీ క్రికెటర్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ నియామకంపై కొందరు భగ్గుమంటున్నారు. వెస్టిండీస్తో జరుగనున్న టెస్టు సిరీస్కు టీమిండియా వైస్ కెప్టెన్గా అజింక్యా రహానే పేరును బీసీసీఐ ఖరారు చేసింది.